ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పాటించి సజావుగా నిర్వహించాలని డీఆర్డీవో అదనపు పీడీ విరోజ స్పష్టంచేశారు.
వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఆర్డీవో అదనపు పీడీ విరోజ, తదితరులు
పాపన్నపేట, న్యూస్టుడే: ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పాటించి సజావుగా నిర్వహించాలని డీఆర్డీవో అదనపు పీడీ విరోజ స్పష్టంచేశారు. గురువారం పాపన్నపేటలో ఉపాధిహామీ పనులపై 12వ విడత సామాజిక ప్రజాదర్బారు నిర్వహించారు. 2019 అక్టోబరు నుంచి 2022 మార్చి వరకు జరిగిన పనుల తీరుపై పరిశీలించారు. రూ.13.98 కోట్ల విలువైన పనులు జరుగగా, కూలీలకు రూ.11.76 కోట్లు చెల్లించారు. వస్తుసామగ్రికి రూ.2.16 కోట్లు వెచ్చించారు. రూ.4.12 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. దీన్ని రికవరీ చేయడంతో పాటు రూ.47,300 జరిమానా విధించారు. అనంతరం డీఆర్డీవో అదనపు పీడీ మాట్లాడుతూ.. ఉపాధిహామీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవకతవలు అరికట్టేందుకు సామాజిక తనీఖీలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. డీవీవో శ్రీహరి, ఏపీడీ బాలయ్య, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఏపీవో శ్వేత, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు
[ 08-05-2024]
‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. -
లాడ్జిలో భారీగా వస్త్రాలు స్వాధీనం
[ 08-05-2024]
రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. -
ఆరుగాలం పంట.. ఆగమాగం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. -
ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?
[ 08-05-2024]
ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. -
పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
[ 08-05-2024]
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు -
అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ
[ 08-05-2024]
ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి -
ప్రజాస్వామ్య ఆయువుపట్టు.. ఓటరన్నా నిలబెట్టు
[ 08-05-2024]
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు. -
పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు
[ 08-05-2024]
పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వలస ఓటరు కలిసొచ్చేనా ..
[ 08-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
కర్షకుల కరుణకు నేతల ఆరాటం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే. -
వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
[ 08-05-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు -
‘గౌరవెల్లి’ నీరందించడమే అత్యంత ప్రాధాన్యం
[ 08-05-2024]
గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!