నిర్లక్ష్యం.. అభివృద్ధికి ఆటంకం
నిధుల లేమి.. కొరవడిన పర్యవేక్షణ.. సిద్ధం చేయని ప్రతిపాదనలు.. ఇవన్నీ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఏళ్ల కిందట మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పూర్తిపై దృష్టిసారించడం లేదు.
జిల్లా కేంద్రంలో ఏళ్లుగా ఇదే తంతు
న్యూస్టుడే, మెదక్
నిధుల లేమి.. కొరవడిన పర్యవేక్షణ.. సిద్ధం చేయని ప్రతిపాదనలు.. ఇవన్నీ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఏళ్ల కిందట మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పూర్తిపై దృష్టిసారించడం లేదు. కీలకమైన వలయ రహదారి విషయంలో అమాత్య ఇచ్చిన హామీ నెరవేరలేదు. జిల్లా కేంద్రం మెదక్లో నెలకొన్న పరిస్థితి ఇది. ఆయా సమస్యల తీరుపై ‘న్యూస్టుడే’ కథనం.
నిజాం కాలంలో సుభాగా కొనసాగిన మెదక్ పట్టణం.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం 21 మండలాలతో కొనసాగుతోంది. ప్రధాన రహదారి విస్తరణ చేపట్టడంతో కాస్త అభివృద్ధి కనిపిస్తోంది. అంతర్గత దారుల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. జలజాలం పనులను సాకుగా చూపారు. ఎట్టకేలకు పనులు పూర్తయినా ఇంకా సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తికాలేదు.
‘వలయ’ దిగ్బంధం
వాహనాల రద్దీ
2014 డిసెంబరులో స్థానిక పీఎన్ఆర్ ఇండోర్ మైదానంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో మెదక్కు బాహ్యవలయ రహదారిని ప్రకటించారు. ఎనిమిదేళ్లయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. మెదక్ మండలం మంబోజిపల్లి వరకు 765 (డి) జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలు మెదక్ మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్కు వెళ్తుండటంతో రద్దీ ఉంటోంది. వేడుకలు నిర్వహణ, ఆందోళనలు చేపట్టినా వాహనాలు నిలిచిపోతున్నాయి. బాహ్యవలయ రహదారికి సర్వే చేసి హద్దులు గుర్తించి వదిలేశారు.
అటకెక్కిన ఆహ్లాదం
గోసంద్రం చెరువు వద్ద..
స్థానిక పిట్లం, గోసంద్రం చెరువులను కలిపి మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దేందుకు రూ.9 కోట్లు విడుదలయ్యాయి. 2014లో పనులు మొదలవగా కట్ట విస్తరణతో పాటు పటిష్టం, ఫుట్పాత్ వంటి పనులు చేపట్టారు. మురుగు కలవకుండా పిట్లం చెరువులో పైపులు బిగించారు. పచ్చదనం ఏర్పాటు, విద్యుత్తు దీపాలు, టైల్స్ వేయాల్సి ఉంది. ఆయా వనరుల కట్ట కయ్యలు పడి మట్టి కొట్టుకుపోతోంది. రెండింటిని అనుసంధానం చేసి హవేలిఘనపూర్ మండలం ముత్తాయికోట మార్గంలోని సంజీవయ్య కాలనీ వద్ద చౌరస్తా అభివృద్ధి చేస్తామన్న ప్రకటన కార్యరూపం దాల్చలేదు. 70 వేలకు పైగా జనాభా ఉండగా ఒక్క ఉద్యానం లేదు.
అసంపూర్తిగా విస్తరణ
గంగినేని థియేటర్ సమీపంలో రహదారి ఇలా..
జిల్లా కేంద్రంలో నర్సాపూర్ మార్గంలోని ఎల్లమ్మ ఆలయం నుంచి గంగినేని థియేటర్ వరకు ప్రధాన రహదారి విస్తరణ చేపట్టారు. కేవలం విభాగిని, ఫుట్ఫాత్ నిర్మించారు. జలజాలం పనులు చేపట్టాల్సి ఉండటంతో విస్తరించిన రహదారిపై తారు వేయలేదు. మరోవైపు నర్సాపూర్ చౌరస్తా వద్ద కూడలి నిర్మించాల్సి ఉంది. ఈ చౌరస్తా నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఇరువైపులా ఫుట్పాత్ నిర్మించగా, పలు చోట్ల ధ్వంసమైంది. ఎల్లమ్మ ఆలయం నుంచి గంగినేని థియేటర్ వరకు తారు రహదారి పనులకు ర.భ. అధికారులు టెండర్లు ఆహ్వానించారు.
త్వరలో పనులు చేపడతాం
- చంద్రపాల్, పురపాలిక అధ్యక్షుడు, మెదక్
మినీ ట్యాంక్బండ్ అభివృద్దిలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులు రావాల్సి ఉంది. పట్టణానికి వలయ రహదారి కాకుండా, కేవలం బైపాస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన ఉన్నందున, ఆ రోజు నిధులు ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. మిగతా పనులు త్వరలో చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?