వ్యయప్రయాసలకోర్చి ప్రాజెక్టుల భూసేకరణ
దేశ వ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పడిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏడున్నర మీటర్లు ఎగువన ఉన్నాయని, స్వరాష్ట్రంలో బోరుబండ్లు, ఆయిల్ ఇంజిన్లు, ఇన్వర్టర్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, వైండింగ్ దుకాణాలు...
సాగునీటి ఉత్సవంలో మంత్రి హరీశ్రావు
చంద్లాపూర్ శివారులో సాగునీటి దినోత్సవంలో నృత్యం చేస్తున్న యువతులు, చిత్రంలో మంత్రి హరీశ్రావు, నాయకులు
సిద్దిపేట, చిన్నకోడూరు, న్యూస్టుడే: దేశ వ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పడిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏడున్నర మీటర్లు ఎగువన ఉన్నాయని, స్వరాష్ట్రంలో బోరుబండ్లు, ఆయిల్ ఇంజిన్లు, ఇన్వర్టర్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, వైండింగ్ దుకాణాలు బందయ్యే పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఒకప్పుడు దేశంలో ఎక్కువగా పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవని, ప్రస్తుతం బిహార్, ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు, హమాలీలు ఆ ప్రాంతానికి ఉపాధి కోసం వస్తున్నారని తెలిపారు. నాడు బతకపోయిన పాలమూరుకు నేడు బతకడానికి ఇతరులు వచ్చే స్థితికి చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సిద్దిపేట శివారు రంగనాయకసాగర్ జలాశయం మధ్యన సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటవకుంటే, ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కాకుంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు సాధ్యమయ్యేవా అని ప్రశ్నించారు. ఎన్నో గొప్ప అనుభూతులు గుర్తుకొస్తున్నాయని, ఎట్లుండె తెలంగాణ, ఎట్లయిందంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాడు సీడబ్ల్యూసీ, అటవీ, పర్యావరణ అనుమతుల నిమిత్తం కేంద్ర శాఖల వద్ద కింది స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద అధికారి వరకు దస్త్రాలు పట్టుకొని ఐఏఎస్లు, ఉన్నతాధికారులతో సహా తిరిగామన్నారు. వివిధ శాఖల వద్ద ఫైళ్లు పట్టుకొని అటెండర్ కూర్చునే బెంచీల వద్ద వేచి చూసే పరిస్థితిని చవిచూశామన్నారు. ప్రజల కోసం స్వార్థం లేకుండా పని చేశామన్నారు. ఆర్.విద్యాసాగర్రావు లాంటి ఎంతోమంది నీళ్ల కోసం కృషి చేశారని, మార్గదర్శకత్వం వహించారని గుర్తుచేశారు. కాళేశ్వరం నిర్మాణంలో మొత్తంగా 70 వేల ఎకరాల భూమిని సేకరిస్తే జిల్లాలో 38 వేల మేర సేకరించామని మంత్రి హరీశ్రావు అన్నారు. దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత జలాశయంగా మల్లన్నసాగర్ నిలిచిందన్నారు. భూసేకరణలో ఎన్నో ప్రయాసలు పడ్డామని, రైతులను వివిధ దశల్లో సముదాయించామన్నారు. ఈ ప్రాంతంలో నాడు వర్షాల కోసం కప్పతల్లి ఆటలు, దేవుళ్ల జలాభిషేకాలు, పూజలు చేసేవారమన్నారు. అత్యద్భుత పర్యాటక కేంద్రంగా రంగనాయకసాగర్ మారనుందని, రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. చంద్లాపూర్ శివారులో ఎత్తిపోతల పనుల (లిఫ్ట్ ఇరిగేషన్)కు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. అనంతరం నీటి పారుదల శాఖ ఇంజినీర్లను సత్కరించారు. ఈఎన్సీ హరిరాం, జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, ఎస్ఈ బస్వరాజ్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం తదితరులు ఉన్నారు. అల్లీపూర్లో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవం, గంగాపూర్లో రేణుక ఎల్లమ్మ, జమదగ్ని కళ్యాణోత్సవానికి మంత్రి హరీశ్రావు బుధవారం హజరయ్యారు. ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..