ఆ తల్లిదండ్రుల కలలు.. కల్లలు
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అయినా వెనుకడుగు వేయకుండా ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేస్తూ.. కుమారుడిని చదువులో వెన్నుతట్టి ప్రోత్సహించారు.
ట్రిపుల్ ఐటీలో చదువుతున్న కుమారుడి మరణంతో తీరని వేదన
తొగుట, సిద్దిపేట, న్యూస్టుడే: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అయినా వెనుకడుగు వేయకుండా ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేస్తూ.. కుమారుడిని చదువులో వెన్నుతట్టి ప్రోత్సహించారు. చురుగ్గా ఉండే ఆ పుత్రుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రయోజకుడిగా ఎదిగి కుటుంబాన్ని ప్రగతిలోకి తీసుకువస్తాడని కోటి కలలుగన్నారు. అనుకోని పరిణామంతో కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో వారి కలలు కల్లలై విషాదంలో ఉన్నారు. అనారోగ్యం రూపంలో వచ్చిన మృత్యువు.. అమ్మానాన్నలు అనుకున్న లక్ష్యాన్ని చేరలేమోననే బాధ.. ఓ క్షణికమైన నిర్ణయంతో బాలుడు సోమవారం ప్రాణాలు తీసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదివే తొగుట మండలం బండారుపల్లికి చెందిన విద్యార్థి (17) బలవన్మరణం చెందిన తీరు తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చింది. తల్లి బీడీలు చుడుతుండగా.. తండ్రి హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మానాన్నల కష్టాన్ని గుర్తించిన బాలుడు మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి.. మెరుగైన జీపీఏతో బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యాడు. గత విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించాడు. ద్వితీయ సంవత్సరంలో ఎలర్జీ, టైఫాయిడ్ సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతూ తరగతులకు దూరమయ్యాడు. హాజరు శాతం తగ్గి పరీక్షలకు నిర్వాహకులు అనుమతి ఇవ్వకపోవడంతో చదువును కొనసాగించలేనేమోనన్న అపోహతో బాల్యంలోనే జీవితాన్ని బలవంతంగా ముగించాడు. మరోవైపు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!