పెరుగుతున్న కరోనా కేసులు
జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సంక్రాంతి తరువాత జిల్లాలో వరసగా రెండు రోజుల్లో భారీ స్థాయిల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య పెరిగింది. సోమవారం 128
ఒక్క రోజులో 198 మందికి పాజిటివ్
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సంక్రాంతి తరువాత జిల్లాలో వరసగా రెండు రోజుల్లో భారీ స్థాయిల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య పెరిగింది. సోమవారం 128 పాజిటీవ్ కేసులు నమోదుకాగా మంగళవారం ఒక్క రోజే 198 మందికి కొవిడ్ పాజిటీవ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెపుతున్నాయి. జ్వరము, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారు కొవిడ్ పరీక్షల కోసం జనరల్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రుల వద్ద పెద్ద సంఖ్యల్లో వరుస కడుతున్నారు. కొవిడ్ లక్షణాలతో మంగళవారం జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్న వారు 3,618 మంది ఉన్నారు. పాజిటీవ్ రేటు 5.8శాతానికి చేరింది. పాజిటీవ్ ఉన్నవారికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొవిడ్ కిట్లు ఇచ్చి హోం ఐసోలేషన్లో ఉంచాలని సూచిస్తున్నారు. లక్షణాలు తీవ్రస్థాయిల్లో ఉన్నవారిని గుర్తించి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులకు పంపుతున్నారు. అయితే కొవిడ్ లక్షణాలు ఉన్నా లెక్క చేయకుండా ఎక్కువ శాతం మంది జనాల్లోనే తిరుగుతున్నారు. కొవిడ్ పాజిటీవ్ ఉన్నవారికి గతంలో చేతికి ప్రత్యేకంగా ముద్రలు వేసి ఐసోలేషన్కు పరిమితం చేసేవారు. ప్రస్తుతం అలాంటి జాగ్రత్తలు తీసుకోని కారణంగా కొవిడ్ పాజిటీవ్ కొందరు బయట తిరుగుతున్నారు. దీంతో ఇతరులకు కొవిడ్ సోకేలా కారకులవుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారిని గుర్తించి పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నా.. అనుకున్న స్థాయిల్లో మార్పులు రావడం లేదు. నిర్లక్ష్యం వీడి కొవిడ్, ఒమిక్రాన్పై ఇప్పటికైనా సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
12-14 ఏళ్ల పిల్లలకు టీకాలు
నల్గొండ అర్బన్: జిల్లాలో మార్చి నెల నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ వయసులో ఉన్న పిల్లలు జిల్లాలో 14,530 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వయసు పిల్లలు 90శాతానికి పైగా పాఠశాలలోనే ఉండటంతో విద్యాసంస్థల్లోనే టీకా వేయాలా, తల్లిదండ్రుల అనుమతితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేయాలా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై సమన్వయ శాఖల అధికారులతో ఒకటీ రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిల్లో కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15-18 ఏళ్ల వయస్సున్న పిల్లలకు తల్లిదండ్రుల అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకా సరఫరా చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..