అందం.. ఆహ్లాదం
ప్రధాన నగరాలలో మాత్రమే దర్శనమిచ్చే ఆకర్షణీయమైన బోర్డులు మిర్యాలగూడ వంటి మధ్య స్థాయి పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నారు పుర అధికారులు. సుమారు రూ.28లక్షలతో ఏర్పాటు చేసిన పట్టణంలోని రామచంద్రగూడెం వై కూడలిలో
● నామ ఫలకలతో మిర్యాలగూడకు కొత్త సొబగులు
మిర్యాలగూడ బోటింగ్ పార్కులో ఏర్పాటు చేసిన ‘లవ్ ఎమ్మెల్జీ’ బోర్డు
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ప్రధాన నగరాలలో మాత్రమే దర్శనమిచ్చే ఆకర్షణీయమైన బోర్డులు మిర్యాలగూడ వంటి మధ్య స్థాయి పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నారు పుర అధికారులు. సుమారు రూ.28లక్షలతో ఏర్పాటు చేసిన పట్టణంలోని రామచంద్రగూడెం వై కూడలిలో ‘వెల్కమ్ ఎమ్మెల్జి’ బోర్డు, బోటింగ్ పార్కులో ‘లవ్ ఎమ్మెల్జి’ బోర్డు, సుందరయ్య పార్కులో ఏర్పాటు చేసిన ‘పురపాలక సంఘం, మిర్యాలగూడ’ బోర్డుతో పాటు ఈదులగూడ బైపాస్ కూడలిలో ‘మన మిర్యాలగూడ’ బోర్డులు ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో ప్రజలు ఆహ్లాదంగా గడుపుతున్నారు.
స్వీయ చిత్రాలజోరు..
పట్టణంలోని తాళ్లగడ్డ బోటింగ్ పార్కులో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన ‘లవ్ ఎమ్మెల్జి’ బోర్డు పట్టణ, పరిసర ప్రాంత ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెంతనే శివాలయం, బోటింగ్ యూనిట్ ఉండటంతో అక్కడికి వచ్చే వారంతా ఈ బోర్డు పక్కన నిలబడి స్వీయ చిత్రాలు దిగుతూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. సెలవు దినాల్లో అక్కడ స్వీయ చిత్రం దిగాలంటే కొద్ది సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు పట్టణంలోని సుందరయ్య పార్కులో రూ.8లక్షలతో ఏర్పాటు ‘పురపాలక సంఘం, మిర్యాలగూడ’ బోర్డు సైతం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి ప్రత్యేకంగా విద్యుద్దీపాలు అమర్చడంతో రాత్రి వేళల్లో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దాని కిందనే నాగార్జున సాగర్ నమూనా ఆనకట్ట ఉండటంతో చిన్నారులు, యువత స్వీయ చిత్రాలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు.
ఆయా బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చని గడ్డి, ఇతర మొక్కలతో సుందరీకరణ చేపట్టడంతో మరింత సౌందర్యం చేకూరింది. ఈ బోర్డులతో పట్టణానికి మరింత అందం చేకూరిందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటి వద్ద ఏర్పాటు చేసిన మినీ పార్కులకు సరైన నిర్వహణ చేపట్టి ఎప్పటికీ ఇలాగే అందంగా ఉంచేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈదులగూడ బైపాస్ కూడలిలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళలో బోర్డు కనిపించడం లేదని..అక్కడ విద్యుద్దీపాలు అమర్చాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్