మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
కళ్ల ముందే తల్లిదండ్రులు, అక్క మరణించారు.. చెల్లెలు తనతో పాటు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుని ఇంటికి చేరుకుంది. ఒకవైపు తల్లిదండ్రులను చూడలన్న కోరిక, మరో వైపు చెల్లెలితో మునుపటిలా ఆడుకోవాలన్న తపన.. ఇలా ఎక్కడి వెళ్లాలో తెలియక.. చెప్పటానికి మాటలు
28 రోజులుగా నిమ్స్ ఐసీయూలో చికిత్స
కుటుంబంలో నలుగురు మృతితో అనాథగా మారిన హన్సిక
మృతురాలు బోయిళ్ల హర్షిత
కళ్ల ముందే తల్లిదండ్రులు, అక్క మరణించారు.. చెల్లెలు తనతో పాటు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుని ఇంటికి చేరుకుంది. ఒకవైపు తల్లిదండ్రులను చూడలన్న కోరిక, మరో వైపు చెల్లెలితో మునుపటిలా ఆడుకోవాలన్న తపన.. ఇలా ఎక్కడి వెళ్లాలో తెలియక.. చెప్పటానికి మాటలు రాక ఆ చిన్నారి 28 రోజుల పాటు ఐసీయూ లో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయింది. దేవుళ్లుగా భావించే డాక్టర్లు ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సూదులు, కత్తులతో తన శరీరానికి కోతలు పెడుతున్నా భరించింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి తనను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నా పెద్దనాన్న కష్టాన్ని చూసీ కన్నీటి చుక్కలనే కృతజ్ఞతగా మార్చింది. ఆయన కదిపిన ప్రతిసారి కన్నీరే సమాధానంగా ఏడ్చింది. గత నెల 21వ తేదీ హన్సిక సాయంత్రం జాతీయ రహదారిపై కోదాడ పట్టణంలోని మేళ్లచెరువు పైవంతెన వద్ద జరిగిన ప్రమాదంలో మెదడులో రక్తం గడ్డ కట్టి కోమాలోకి వెళ్లిన చిన్నారి (7) హర్షిత దీనగాథ ఇది.
-కోదాడ, న్యూస్టుడే
ఇన్నాళ్లు పడిన నకరం చాలనుకుందో.. ఏమో.. గురువారం నిమ్స్లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచి తల్లిదండ్రుల వద్దకే వెళ్లిపోయింది. చెల్లెలు ఐశ్వర్యను అనాథగా మిగిల్చింది. బంధువులకు గుండెకోతను మిగిల్చింది. తాజాగా చిన్నారి మృతితో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతదేహానికి గాంధీలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు కోదాడ ఏఎస్ఐ సైదా శుక్రవారం స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
హర్షిత
ఆపన్నహస్తం అందినా..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బోయళ్ల హర్షిత, హన్సికను మొదట ఖమ్మం వైద్యశాలకు, అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు. వారిని కాపాడుకునేందుకు వారి పెద్దనాన్న అప్పులు తెచ్చి చికిత్స చేయించారు. పేద కుటుంబం కావటం తమ స్థాయికి మించి వైద్య ఖర్చులు అవుతుండటంతో బంధువులకు పాలుపోని పరిస్థితి. ప్రమాద సమయంలో అండగా ఉంటామన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు పరుగులు తీశారు. వారి నుంచి పరామర్శలు, సానుభూతి మాటలే వినిపించాయి తప్ప సాయమందలేదు. దీంతో చిన్నారుల పెద్దనాన్న ‘ఈనాడు’ను ఆశ్రయించారు. వారి దీనగాథ, వైద్య ఖర్చులకు అవసరమైన సాయమందించాలంటూ ‘అనాథ ఆడబిడ్డలను.. ఆదుకోరూ..!’ శీర్షికన ఏప్రిల్ 24న కథనం ప్రచురించింది. మంత్రి కేటీఆర్ స్పందించి రూ. 5 లక్షల మేర ఎల్వోసీ మంజూరు చేశారు. చికిత్స తీసుకుని ఐశ్వర్య ఇంటికి చేరగా.. హర్షిత ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది. నాలుగు రోజుల కిందట ఆమెకు మంజూరు చేసిన పరిమితి కూడా ముగిసిందని వైద్యులు బంధువులకు తెలిపారు. అప్పటి మరో రూ. లక్ష వరకు అప్పు ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే బకాయిలు చెల్లించాలని చెప్పటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అప్పు కోసం ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ఎన్ఆర్ఐ జలగం సుధీర్ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్రావుకు ట్విటర్ ద్వారా తెలపటంతో స్పందించిన మంత్రి వెంటనే ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వెంటనే బంధువులకు మృతదేహాన్ని అందజేశారు.
హన్సిక
గ్రామంలో విషాదఛాయలు
ఒకే కుటుంబంలో నలుగురు మృతివార్త గ్రామంలో విషాద ఛాయలను నింపింది. తాజాగా చిన్నారి మృతి విషయం తెలియటంతో బాధితుల ఇంటి వద్దకు గ్రామస్థులు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ఐదుగురు సభ్యుల గల కుటుంబంలో ప్రమాదంలో నలుగురు మరణించడంతో మిగిలిన చిన్నారి హన్సిక అనాథగా మారింది. చిన్నారి ప్రస్తుతం చిలుకూరు మండలంలోని సీతారాంపురంలో అమ్మమ్మ ఇంట్లో ఉండి కోలుకుంటోంది. మంత్రులు సాయమందించిన మొత్తం కాకుండా మరో రూ. 5 లక్షలు ఖర్చు చేసినా చిన్నారి దక్కలేదని బాధితురాలి పెద్దనాన్న రాంబాబు ‘న్యూస్టుడే’ మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?