ఇక బలమిచ్చే బియ్యం
నిరుపేదలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి వారిని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ‘పోషకాలతో మిళితమైన బలవర్ధక బియ్యం’ ను పంపిణీ చేసేందుకు ( ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్) ఏర్పాట్లు చేస్తోంది.
కస్టమ్ మిల్లింగ్ లెవీతో ‘ఫోర్టిఫైడ్ రైస్’ సేకరణ
మిర్యాలగూడ, న్యూస్టుడే
మిర్యాలగూడలో మిల్లులో ఏర్పాటు చేసిన బ్లెండింగ్ యంత్రం నమూనా
నిరుపేదలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి వారిని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ‘పోషకాలతో మిళితమైన బలవర్ధక బియ్యం’ ను పంపిణీ చేసేందుకు ( ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్) ఏర్పాట్లు చేస్తోంది. సంచార జాతులు, నిరుపేదలు ఎక్కువగా ఉండే జిల్లాలు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా ఈ ‘ పోషకాలతో మిళితమైన బలవర్ధక బియ్యం’ పంపిణీ చేస్తుంది. ఇతర జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు ఈ తరహా ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ను సరఫరా చేస్తుండగా.. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు.. ఆ తర్వాత నిరుపేదలకు ఇచ్చే ప్రజాపంపిణీ కేంద్రాలకు వీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు.
పౌరసరఫరాలశాఖ మిల్లులకు పంపిణీ చేసిన పోషకాల బస్తాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీ ధాన్యం సేకరణ చేపడుతుండగా.. ఆయా మిల్లుల నుంచి ‘ ఫోర్టిపైడ్ రైస్ ’ను సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల నుంచి, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ చేయించే క్రమంలో ఎఫ్సీఐకి ఇచ్చే లెవీ విషయంలో ఫోర్టిఫైడ్ బియ్యం ఇచ్చేలా నిబంధనలు పెట్టారు. ప్రతి క్వింటాలు బియ్యానికి కలపాల్సిన పోషకాలను పౌరసరఫరాల శాఖ వారు మిల్లులకు ఇప్పటికే పంపిణీ చేశారు. నిర్ణీత బస్తాలలో పంపిన పోషకాలను మిల్లర్లు బియ్యంలో కలిపి ఎఫ్సీఐకి ఇచ్చే లెవీ పోషకాలతో కూడిన బియ్యం అందించనున్నారు. మార్చి తరువాత ప్రజాపంపిణీ ద్వారా దీన్ని పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
బియ్యం మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని బియ్యం మిల్లుల్లో ఇప్పటికే బ్లెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అధునాతన మిల్లుల్లో ఇప్పటికే ఈ తరహా బ్లెండింగ్ యూనిట్లు ఉన్నాయి. 2024 నాటికి వందశాతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధకమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థకు అందించే బియ్యానికి మిల్లర్లు అదనపు పోషకాలు కలుపుతున్నారు. ఈ తరహాల్లో కలిపేందుకు బ్లెండింగ్ యూనిట్లను నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఉమ్మడి జిల్లాలోని మిల్లుల్లో ఏర్పాటు చేస్తున్నారు. పార్బాయిల్డ్, రా మిల్లుల్లోను వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
* బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఏ , జింక్ , ఇతర పోషకాలను చేర్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
* ఒక క్వింటాలు సాధారణ బియ్యానికి ఒక కిలో పోషకాలను మిళితం చేస్తున్నారు. మిల్లుల్లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లెండింగ్ యూనిట్లతో ఒకేసారి బియ్యం తయారు చేసేలా ఏర్పాటు చేశారు.
వందశాతం పోషకాలతో కూడిన బియ్యం సేకరిస్తున్నాం
నాగేశ్వర్రావు, డీఎం పౌరసరఫరాలు, నల్గొండ
ప్రస్తుతం కస్టమ్ మిల్లింగ్ ధాన్యం నుంచి ఇచ్చే లెవీలో వందశాతం పోషకాలతో కూడిన బియ్యాన్ని సేకరిస్తున్నాం. ఈ తరహా బియ్యంను మాత్రమే ఎఫ్సీఐ అధికారులు లెవీగా అంగీకరించేలా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అపుడు ప్రజాపంపిణీ, ప్రభుత్వ పాఠశాలలకు ఈ తరహాలో షోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?