317 జీవో ఉపాధ్యాయులకు బదిలీలు
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో 317 జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో కింద ఉమ్మడి జిల్లా నుంచి విభజించిన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించారు.
జిల్లాలో 333 మందికి అవకాశం
సూర్యాపేట(మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్టుడే
డీఈవో కార్యాలయంలో బదిలీల దరఖాస్తులు పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారులు
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో 317 జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో కింద ఉమ్మడి జిల్లా నుంచి విభజించిన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించారు. ఆ ఉపాధ్యాయులు పాత జిల్లాల్లో పనిచేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీకి అవకాశం ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వారిలో ఆనందô వెల్లివిరిసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 333 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలగనుంది.
కొత్త షెడ్యుల్ విడుదల
అన్ని జిల్లాలకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించాలనే సంకల్పంతో గతేడాది డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 కింద సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. ఇందులో ఉపాధ్యాయులు చాలామంది సొంత జిల్లా నుంచి పొరుగు జిల్లాకు వెళ్లారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్రమే తాజాగా చేపడుతున్న బదిలీలకు అర్హులుగా పేర్కొనడంతో వీరికి బదిలీకి అవకాశం లేకుండా పోయింది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారు గత నెల 28 నుంచి 31 వరకు బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా.. విద్యాశాఖాధికారులు స్వీకరించారు. దీంతో జీవో 317 ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు రావడంతో ప్రభుత్వం బదిలీ ప్రక్రియను ఆపేసి కొత్త షెడ్యూల్ జారీ చేసింది.
బదిలీలు ఆలస్యం!
జిల్లాలో 3.519 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇటీవల బదిలీ కోసం ఆన్లైన్లో 2,419 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా బదిలీలకు సీనియార్టీ జాబితాను మంగళవారం వెల్లడించాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ జాబితాను విడుదల చేయొద్దని రాష్ట్ర అధికారులు డీఈవోలకు ఆదేశాలు ఇవ్వడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో 317 జీవో ఉపాధ్యాయులతో సీనియార్టీ జాబితాను విడుదల చేయాల్సి ఉండటంతో బదిలీ ప్రక్రియ కొంత ఆలస్యం కానుంది. ఉమ్మడి జిల్లాలో పనిచేసిన కాలానికి జీవో 317 ఉపాధ్యాయులకు సర్వీసు పాయింట్లు కేటాయిస్తుండటంతో ఇప్పుడున్న స్థానాలకు బదులుగా అనువైన స్థానాల్లో పోస్టింగ్ లభించనుందని వారు భావిస్తున్నారు.
సవరింపు ఇలా..
గతంలో విడుదల చేసిన కాలపట్టిక ప్రకారం మార్చి 4వ తేదీతో బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంతో సవరించిన కాలపట్టికతో మార్చి 14 వరకు కొనసాగనుంది.
* ఫిబ్రవరి 12-14 వరకు: జీవో 317 ఉపాధ్యాయుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
* 21, 22 తేదీల్లో: సీనియార్టీ తుది జాబితా ప్రకటన
* 24వ తేదీ: ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు
* 26, 27, 28 తేదీల్లో: స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి
* మార్చి 4, 5 తేదీల్లో: స్కూల్ అసిస్టెంట్ల బదిలీ
* మార్చి 7, 8, 9 తేదీల్లో: ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
* మార్చి 14వ తేదీ: ఎస్జీటీలకు బదిలీలు
* మార్చి 16-30వ తేదీల మధ్య: డీఈవోలు, ఆర్జేడీల ఉత్తర్వులపై అభ్యంతరాల సమర్పణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు