logo

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక

సూర్యాపేటకు చెందిన న్యాయవాది మహ్మద్‌ ఫరీహ అహ్మద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు.

Published : 26 Mar 2023 04:45 IST

ఫరీహ

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేటకు చెందిన న్యాయవాది మహ్మద్‌ ఫరీహ అహ్మద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిల నియామకం కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో ఫరీహ ప్రతిభ చాటడంతో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట పట్టణానికి చెందిన ఫరీహ తల్లి తమీనా సుల్తాన్‌ టీచర్‌. తండ్రి ఫరీదుద్దీన్‌ అహ్మద్‌ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఫరీహ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివిన అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. 2022లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆమె తొలి ప్రయత్నంలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు న్యాయవాదులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని