స్థానం..25
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలు తమ ప్రతిభను చాటారు. అత్యధికంగా పది గ్రేడు పాయింట్లు సాధించి అగ్రభాగాన నిలిచారు.
జిల్లాలో 90.44 శాతం ఉత్తీర్ణత
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలు తమ ప్రతిభను చాటారు. అత్యధికంగా పది గ్రేడు పాయింట్లు సాధించి అగ్రభాగాన నిలిచారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల పరిధిలో 9,108 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 8,237 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4,205 మంది బాలికలు, 4,032 మంది బాలురు ఉన్నారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 90.44 నమోదైంది. ప్రస్తుత ఫలితాల్లో 25వ స్థానానికి పరిమితమైంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పదో తరగతిలో విద్యాశాఖ పలు వినూత్న కార్యక్రమాలు అమలు పర్చినప్పటికి ఆశించిన ఫలితాలు దక్కకపోవడం గమనార్హం.
పది గ్రేడ్ పాయింట్లు వీరికే..
జిల్లా వ్యాప్తంగా 192 ప్రభుత్వ, రెసిడెన్షియల్ పదో తరగతి పాఠశాలలు, 75 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పది గ్రేడు పాయింట్లను సాధించడంలో పలు ప్రైవేటు పాఠశాలలదే పైచేయిగా మారింది. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 68 మంది విద్యార్థులు పది జీపీఏ సాధించారు. 31 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పది గ్రేడు పాయింట్లు సాధించారని విద్యాశాఖాధికారులు తెలిపారు. భువనగిరి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, రఘునాథ్పూర్, కొయ్యలగూడెం జడ్పీ పాఠశాల విద్యార్థులు ఇద్దరు పది గ్రేడ్ పాయింట్ సాధించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లెపై వారిదే పెత్తనం.. వచ్చేసింది నకిలీ విత్తనం
[ 22-05-2024]
మరో పది రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండలోని మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, హాలియా, చందంపేట, నాంపల్లి, మునుగోడు, చండూరుతో పాటూ ఆలేరు, సూర్యాపేట, నకిరేకల్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను పలువురు డీలర్లు డంప్ చేస్తున్నారు. -
తగ్గుతున్న సాధారణ ప్రసవాలు
[ 22-05-2024]
జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు, ప్రతి శుక్రవారం ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇతర వైద్య సేవలపై సమీక్షలు నిర్వహించే వారు. -
మోసపోతే గోసపడతాం..!
[ 22-05-2024]
నల్గొండ అర్బన్, మిర్యాలగూడ, హాలియా, హుజూర్నగర్ : ఒకసారి కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయామని (గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయడాన్ని ప్రస్తావిస్తూ).. -
సన్నగా తెరపైకి..!
[ 22-05-2024]
వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్కే మాట మార్చింది. ఇ -
జీవనశైలి మారాలి.. పుడమి మురవాలి
[ 22-05-2024]
మారుతున్న ప్రజల జీవనశైలి.. పట్టణ జనాభా పెరుగుదల, విపరీతమైన అభివృద్ధి నినాదం.. వెరసి భూమి అనేక రకాల విధ్వంసానికి గురవుతోంది. -
ఊహించని మరణం.. ఆరుగురి జీవితాల్లో వెలుగు
[ 22-05-2024]
ఓ మహిళా ఊహించని ప్రమాదంతో ఆకస్మికంగా మృతి చెందినా, అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. -
ఎంజీయూ ఇన్ఛార్జి వీసీగా నవీన్ మిత్తల్
[ 22-05-2024]
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీగా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్ నియమితులయ్యారు. -
అరచేతిలో మేఘ సందేశం
[ 22-05-2024]
వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లు రూపొందించింది. ప్రధానంగా వర్షకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
అమ్మ ఆశయం నెరవేర్చి.. అంచెలంచెలుగా ఎదిగి
[ 22-05-2024]
రెక్కల కష్టాన్నే నమ్ముకున్న ఆ గిరిజన దంపతులు.. ఉన్న కొద్దిపాటి భూమిలో ఆరుగాలం శ్రమించినా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. -
పట్టభద్రులూ.. ఓటు వేయాలి ఇలా..!
[ 22-05-2024]
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. -
దేవరకొండ గాంధీ
[ 22-05-2024]
పట్టణానికి చెందిన మునగాల కొండల్రావును దేవరకొండ గాంధీగా పిలుస్తుంటారు. స్వాతంత్య్రానంతరం చాలామంది విద్యకు దూరంగా ఉండేవారు. -
ప్రభుత్వ బడి.. ప్రకాశించదేమి?
[ 22-05-2024]
కార్పొరేట్ విద్య కొత్త పుంతలు తొక్కుతోంది. పట్టణాల్లో విస్తరించి ఉన్న పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు పల్లె దరికి చేరువవుతున్నాయి. -
పటిష్ఠమయ్యేలా.. పనులు జరిగేదెలా?
[ 22-05-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేసి చాలాకాలం అవుతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. -
ఓటు ఒక్కటి.. పోలింగ్ కేంద్రాలు రెండు
[ 22-05-2024]
ఈ చిత్రంలో కన్పిస్తున్న పోల్ చిట్టీలో పోలింగ్ కేంద్రం పేరు వద్ద ఆంగ్లంలో ఒక కేంద్రం, తెలుగులో మరో కేంద్రం పేరు అచ్చయింది. ఇలాంటి పోల్ చిట్టీలు పట్టణంలో ఎక్కువ మంది పట్టభద్రుల ఓటర్లకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. -
బ్రహ్మోత్సవం.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం
[ 22-05-2024]
మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుని ఆలయంలో ఈనెల 26 వరకు ఆరు రోజులు నిర్వహించనున్న శ్రీస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
స్తంభోద్భవుడి సన్నిధిలో ఆధ్యాత్మిక సంబరం
[ 22-05-2024]
పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రీశుల గర్భాలయంలో మంగళవారం మూలవరులకు ప్రత్యేక అభిషేకం, మహాముఖ మండపంలో మూలమంత్ర హవనం, ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పారాధన, మాడవీధుల్లో అలంకార సేవా పర్వం, వాహన సేవోత్సవం కైంకర్యాలతో నృసింహ జయంతి మహోత్సవం కొనసాగింది. -
ఓటు వేసే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎన్నికల అధికారి
[ 22-05-2024]
వరంగల్ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి,నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. -
ఊపందుకున్న ప్రచారం
[ 22-05-2024]
నల్గొండ- వరంగల్-ఖమ్మం పట్టుభద్రుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ప్రచార గడువు ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగుస్తుంది.