పరిహారానికి సర్వే
ఉమ్మడి జిల్లాలో వడగళ్లు, అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల వర్షాలకు నిమ్మ, మామిడి తోటలు, వరి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
పంట నష్టపోయిన రైతుల వివరాల సేకరణ
సూర్యాపేట జిల్లాపైనే ప్రభావం ఎక్కువ
సూర్యాపేట: తిరుమలగిరిలో వరి పంటను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, తదితరులు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో వడగళ్లు, అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల వర్షాలకు నిమ్మ, మామిడి తోటలు, వరి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయం ప్రకటించారు. కౌలు రైతులకు సైతం పరిహారం ఇస్తామని చెప్పారు. దీంతో పంట నష్టం వివరాలు సేకరించే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. క్షేత్రస్థాయికి వెళ్లి సిబ్బంది సర్వే చేస్తున్నారు. మరో అయిదు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రైతుల పూర్తి సమాచారాన్ని, పంట నష్టం వివరాలను తెలుసుకోవాలని అందులో సూచించారు. విస్తీర్ణంలో అతిపెద్దదైన నల్గొండ జిల్లాలో పంటలు దెబ్బతిన్న విస్తీర్ణం తక్కువ ఉండటం రైతులకు ఊరటనిస్తోంది. ఉమ్మడి జిల్లాలో చూస్తే సూర్యాపేట జిల్లాకే నష్టం తాకిడి ఎక్కువగా ఉంది.
గ్రామాల వారీగా...
ఉమ్మడి జిల్లాలో 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, వీఏవోలు, పంచాయతీ కార్యదర్శులతో సర్వే చేపడుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి నేరుగా వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్దేశిత నమూనాతో వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రైతు పేరు, పంట విస్తీర్ణం, సర్వే నెంబర్, ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా తదితర వివరాలు నమోదు చేసుకుంటున్నారు. కౌలు రైతుల నుంచి సైతం ఇదే సమాచారాన్ని సేకరిస్తున్నారు. రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా వారి వద్దకే వ్యవసాయ అధికారులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
అభ్యంతరాలు లేకుంటే ఖరారు
ఉమ్మడి జిల్లాలో 10,988 రైతులకు సంబంధించి 23,132 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా ఎక్కడైనా పంట నష్టం వాటిల్లిన రైతులు ఉంటే వ్యవసాయ అధికారులు వారి పొలాలకే వెళ్లి పరిశీలించి నష్టం అంచనా వేయనున్నారు. సర్వే పూర్తి చేసి జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. దానిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిష్కరిస్తారు. లేకుంటే దానినే ఖరారు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఖరారు చేసిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి పరిహారం కోసం ఉన్నతాధికారులకు పంపేలా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు అందాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..