సాంకేతిక సారథి.. అనువాద వారధి
ఆయన ఓ రచయిత, సాంకేతిక నిపుణుడు.. అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్గా చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించింది. ఆయనే కొణతం దిలీప్. మోత్కూరు పురపాలిక పరిధిలోని ఆరెగూడేనికి చెందిన ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి, అంచెలంచెలుగా ఎదిగారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులు స్వీకరణ
2023, సెప్టెంబరు 21న కేంద్ర మాజీమంత్రి ముక్తార్ అబ్బాస్నఖ్వీ చేతుల మీదుగా సోషల్మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంటున్న దిలీప్
మోత్కూరు, న్యూస్టుడే: ఆయన ఓ రచయిత, సాంకేతిక నిపుణుడు.. అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్గా చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించింది. ఆయనే కొణతం దిలీప్. మోత్కూరు పురపాలిక పరిధిలోని ఆరెగూడేనికి చెందిన ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి, అంచెలంచెలుగా ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా కీలక పాత్ర పోషించి.. ఆ శాఖ మాజీ మంత్రి కేటీఆర్కు కుడి భుజంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగిన వెబ్సైట్ ‘మిషన్ తెలంగాణ’ను సృష్టించింది కొణతం దిలీపే.
ఒక దళారీ పశ్చాత్తాపంతో గుర్తింపు
కొణతం దిలీప్ తండ్రి బక్కారెడ్డి సీపీఐలో ఆది నుంచి ఎంతోకాలం పనిచేశారు. ఆ పార్టీ నుంచి రామన్నపేట ఎమ్మెల్యేగా కూడా పోటీచేశారు. దిలీప్ హైదరాబాద్లోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, అక్కడే వివేకావర్ధని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా అనుబంధ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన ‘కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్మ్యాన్’ అనే ఆంగ్ల పుస్తకాన్ని ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో తెలుగులోకి అనువాదించారు. ఆ పుస్తకం తెలుగులో సంచలనం సృష్టించి, దిలీప్కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ పుస్తకాన్ని మోత్కూరులోనే ఆవిష్కరించారు. పలుమార్లు పునఃముద్రణ కూడా అయ్యింది. కుట్రాజకీయం (అనువాదం), జంగల్ నామా (అనువాదం), ఏ రిబట్టల్ టూ విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండా, ఫ్యూచర్ ఫర్ఫెక్ట్ కేటీఆర్ (ఆంగ్లంలో) అనే పుస్తకాలు రాశారు. తెలంగాణలో ఒక కాళరాత్రి అనే రచన చేశారు.
గూగుల్ ఉద్యోగం వదిలి..
కొణతం దిలీప్, రచయిత
మా అక్క విజయ సలహాతో 2006లో గూగుల్లో ఉద్యోగంలో చేరాను. 2009లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో స్నేహితులతో కలిసి ‘మిషన్ తెలంగాణ’ ప్రారంభించాను. ఆ సమయంలోనే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రావు, తెలంగాణ ఉద్యమ నేతలతో పరిచయం ఏర్పడింది. డిజిటల్ మీడియా డైరెక్టర్గా గతేడాది వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి వివరించాను.
అందుకున్న అవార్డులు..
- 2020 ఫిబ్రవరి 23న కొవిడ్-14 సమయంలో కమ్యూనికేషన్ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్ మీడియా వింగ్కు ‘పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) అవార్డు అందుకున్నారు.
- 2021 సెప్టెంబరు 17న గోవాలో జరిగిన 15వ పీఆర్సీఐ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సదస్సులో కొణతం దిలీప్కు ‘పీఆర్సీఐ చాణక్య’ అవార్డు దక్కింది.
- 2023 సెప్టెంబరు 21న జరిగిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ కాంక్లేవ్లో మాజీ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్నఖ్వీ చేతులమీదుగా సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తంలోకి ఆహ్వానం..!
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండు స్థానాలకు ఇన్ఛార్జులుగా మంత్రి ఉత్తమ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్నారు. -
పక్షం రోజుల లక్ష్యం.. ప్రచారాస్త్రాలు సిద్ధం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఇప్పటికే తేలిపోవడంతో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. -
వారు ఆడిందే ఆట.. కాసుల వేట
[ 28-04-2024]
కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. -
నిద్రలేమి.. నిండు ప్రాణాలు బలి
[ 28-04-2024]
నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం. -
ఆయిల్పాం తోటలకు నీటి కొరత
[ 28-04-2024]
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పంచనారసింహులకు భక్తుల పూజలు
[ 28-04-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
ఆటాడుకుందాం..రా..!
[ 28-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు చరవాణులకే పరిమితం కాకుండా.. వాటి నుంచి చిన్నారుల దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. -
సంఘాలను కాదని.. సంస్థకు అప్పగించి..
[ 28-04-2024]
పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు. -
లెక్కకు మించితే వేటే
[ 28-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం కన్నేసింది. -
లోక్సభ ప్రచారంలో.. స్థానిక వ్యూహం
[ 28-04-2024]
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. -
ద్విసభ.. పదేళ్ల ముచ్చట
[ 28-04-2024]
లోక్సభకు 1951లో తొలిసారి ఎన్నికలు జరగగా హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతానికి 1952లో జరిగాయి. మద్రాసు రాష్ట్రం పరిధిలోని ఆంధ్రా ప్రాంతానికి, హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకునే వారు. -
మరో ఉద్యమానికి శ్రీకారం: జగదీశ్రెడ్డి
[ 28-04-2024]
ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..