డివిజన్లలో తిరగలేకున్నాం!
నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు సంధించిన కొన్ని ప్రశ్నలివి. మేయర్ స్రవంతి అధ్యక్షతన గురువారం కౌన్సిల్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను వివరించారు. ప్రతిపక్షం
నగరపాలక సంస్థ తొలి సర్వసభ్య సమావేశం
పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగాలపై వాడీవేడి చర్చ
సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు..
‘నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కాలువలు సిల్టుతో నిండిపోయాయి. గతంలో దోమల నివారణ మందైనా పిచికారీ చేసేవారు. ప్రస్తుతం అది కూడా లేదు. ప్రజలు దోమలతో అల్లాడుతున్నారు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు సైతం అందించలేకున్నాం.’
‘హోర్డింగ్ల నుంచి పన్నులు వసూలు చేయడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. హోర్డింగ్ నిర్వాహకులు ఏమైనా ఒప్పందాలు కుదర్చుకున్నారా! నగరంలో సమస్యల పరిష్కారానికి నిధులు లేవంటూ పదేళ్ల పాటు వాహనాలు లీజుకు తీసుకోవడం అవసరమా? ’
‘సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చినా స్పందన ఉండటం లేదు. భారీగా పన్నులు వసూలు చేస్తూ.. సమస్యలు పరిష్కరించకుంటే ఎలా? ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలా అయితే డివిజన్లలో ఎలా తిరగాలి?’
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్టుడే : నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు సంధించిన కొన్ని ప్రశ్నలివి. మేయర్ స్రవంతి అధ్యక్షతన గురువారం కౌన్సిల్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను వివరించారు. ప్రతిపక్షం లేకపోవడంతో కౌన్సిల్లో ప్రవేశపెట్టిన 28 అజెండా అంశాలకు సభ్యులంతా ఆమోదం తెలిపారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు.
పారిశుద్ధ్యంపై దృష్టేదీ?
ఆరోగ్య అధికారి హోటళ్లపై దాడులు చేయడం తప్ప పారిశుద్ధ్యం పట్టించుకోవడం లేదని 14వ డివిజన్ కార్పొరేటర్ ప్రతాప్రెడ్డి విమర్శించారు. కార్పొరేటర్ షేక్ సత్తార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా.. ఫాగింగ్ సరైన రీతిలో జరగడం లేదన్నారు. తాగునీరు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితరాలను కూడా మెరుగుపరచలేకపోతున్నారన్నారు. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్, మరో కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఊటుకూరు నాగార్జున వివిధ అంశౄలను ప్రస్తావించారు. కిన్నెర మాల్యాద్రి జనవరి 19వ తేదీకే ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ ఉద్యోగ విరమణ పూర్తయినా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. వాటికి మేయర్ స్పందిస్తూ.. నగరపాలక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకువెళదామన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి సూచిస్తూనే.. సంపూర్ణ సహకారం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు.
సమస్యలు చక్కదిద్దుతాం
కమిషనర్ దినేష్కుమార్ సమాధానాలు ఇస్తూ కార్పొరేషన్కు అవసరమైన జేసీబీ వంటి భారీ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని, అందుకే, లీజు పద్ధతిలో తీసుకున్నామన్నారు. అన్ని డివిజన్లలో వీధి దీపాలు, రోడ్లు మరమ్మతులు, ఇంటింటికి మంచినీటి కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల ఫాగింగ్ , డ్రెయిన్లలో పూడిక తీత, వీధుల్లో కుక్కల బెడద, రోడ్లపై పశువుల సంచారాన్ని నివారిస్తామన్నారు. ఆదిత్యనగర్లో నిర్మాణంలో ఉన్న పార్కుకు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని, పొగతోటలో నాగులమిట్ట రోడ్డు నుంచి ట్రంకు రోడ్డు వరకు ఉన్న వీధికి డాక్టర్ పీఎల్రావు పేరు పెట్టాలని కౌన్సిల్ తీర్మానించిందన్నారు.
ఆ పథకాలు పూర్తి చేయాలి - వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ
ప్రతిపక్షం లేని పాలకవర్గాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తాను మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నా. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకానికి కేంద్రం నిధులు అందించింది. వాటిని పూర్తి చేయాలి. రోడ్ల బాగుకు చర్యలు తీసుకోవాలి.
అప్పు గ్రాంట్ కింద మార్చాలి - రూప్కుమార్యాదవ్, డిప్యూటీ మేయర్
గత ప్రభుత్వ హయాంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు 10.5 శాతం వడ్డీతో హడ్కో నుంచి రుణం తెచ్చుకున్నారు. అది కార్పొరేషన్కు మోయలేని భారంగా ఉంది. తాగునీటి పథకం 95 శాతం, భూగర్భ డ్రైనేజీ 85 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ అప్పును గ్రాంట్ కింద మార్చేందుకు కృషి చేయాలి అని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని కోరారు.
మాట్లాడుతున్న మేయర్ పొట్లూరి స్రవంతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదే మాట.. పాత హామీల మూట!
[ 10-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రత్యేక మ్యానిఫెస్టో, అందులోని అంశాలను చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కొండంత దోపిడీ
[ 10-05-2024]
వైకాపా నాయకులు అయిదేళ్లు అనకొండల్లా మారారు. అధికారమే అండగా.. రాజకీయమే పెట్టుబడిగా.. ఎక్కడ నాణ్యమైన మట్టి కనిపిస్తే అక్కడ వాలిపోయారు. నిబంధనలు కాలరాస్తూ ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. -
విద్యార్థుల ఉత్తీర్ణతకు చర్యలు
[ 10-05-2024]
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ అనుబంధ పరీక్షల్లో పాసయ్యేలా హెచ్ఎంలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు తెలిపారు. -
మస్తు చెప్పారు ఉపాధి ఆపేశారు
[ 10-05-2024]
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాయితీతో అందించే రుణాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. -
హోరెత్తిన తెదేపా ప్రచారం
[ 10-05-2024]
తెదేపా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న వారు కార్యకర్తలతో కలసి గురువారం వాడవాడలా ప్రచారం చేశారు. -
వలేటివారిపాలెం బాధలు వర్ణనాతీతం
[ 10-05-2024]
మండలంలో సమస్యలు తిష్ఠ వేశాయి. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సమస్యల వాడలు.. పట్టని పాలకులు
[ 10-05-2024]
పట్టణంలోని పాతూరుతో సహా సమీప ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఛిద్రమైన రహదారులు.. పూడికతో నిండిన కాలువలతో నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. -
కాలనీల్లో కష్టాలు.. ఇంకా ఎన్నాళ్లు?
[ 10-05-2024]
పట్టణంలోని పలు కాలనీలు కీలకమైన మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించే నాధులే లేకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అధ్వాన దారులు.. పట్టని పాలకులు
[ 10-05-2024]
తెదేపా హయాంలో మట్టి రోడ్డుగా ఉన్న తొడుగుపల్లెకు 16 ఏళ్ల కిందట తారు రోడ్డు వేశారు. అధ్వానంగా తయారవడంతో అయిదేళ్లుగా మరమ్మతులు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు. -
పసిమొగ్గలపై శీతకన్నేల పాలకా!
[ 10-05-2024]
బాలల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం.. బడులన్నీ బాగు చేస్తున్నాం.. అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం.. ఇవీ జగన్ మాటలు. క్షేత్రంలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. కూలే భవనాలు.. ఇరుకు గదుల్లో ఊపిరాడక బాలలు అల్లాడిపోతున్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
[ 10-05-2024]
జండాదిబ్బలో మంగళవారం రాత్రి హత్యకు గురైన సుబ్బమ్మ కేసులో ఇద్దరు నిందితులను గురువారం సంగం సి.ఐ.రవినాయక్, ఎస్సై కె.నాగార్జునరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండులో అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం