ఇంటికే పోషకాహారం..!
అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని శత శాతం తినేలా చూడాలని జిల్లా అధికారులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రాలకు రాలేని గర్భిణులు, బాలింతల చెంతకు భోజనం
అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం తింటున్న చిన్నారులు
అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని శత శాతం తినేలా చూడాలని జిల్లా అధికారులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉన్న నిబంధనలు సడలించి ప్రతి ఒక్కరికీ పోషకాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తగిన విధంగా చర్యలు చేపట్టారు. కేంద్రాలకు రాలేని వారి వివరాలను సేకరించి వారి ఇంటి వద్దకే పోషకాహారాన్ని అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
న్యూస్టుడే, దుత్తలూరు, కొండాపురం
జిల్లాలో మొత్తం 2,934 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం వండి వడ్డించేవారు. కరోనా మహమ్మారి రావడంతో కేంద్రాలన్నీ మూతపడ్డాయి. కేంద్రాలు తెరిచిన తరువాత చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నా గర్భిణులు, బాలింతలకు ఇంటికి సరకులను అందజేసేవారు. జులై నుంచి కేంద్రాల్లోనే గర్భిణులు, బాలింతలకు కేంద్రాల్లోనే వండి పోషకాహారం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ కారణాలతో కేంద్రాల్లో భోజనం చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. దీంతె కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అలాంటి వారికి ఇప్పటిదాకా కేంద్రాల కార్యకర్తలు అనధికారికంగా వండిన, సరకులను లబ్ధిదారులకు ఇచ్చేవారు. రోజూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా కేంద్రాల్లో భోజనం చేసిన వారి వివరాలు యాప్లో నమోదు చేసినపుడు భోజనం చేయని వారి గురించి ఉన్నతాధికారులు ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాలు దూరంగా ఉండటంతో పాటు 8-10 నెలల గర్భిణులు, ఒకటి నుంచి మూడు నెలల లోపు బాలింతలు నడిచి కేంద్రాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఇక నుంచి కేంద్రాల్లో వండిన ఆహారాన్ని వారి ఇళ్లకు పంపించాలని సూచించింది. కేంద్రాలకు వచ్చిన వారికి పోషకాహారం పెట్టాలని, రానివారికి ఇళ్లకు పంపించాలని ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశించారు. కేంద్రాల కార్యకర్తలు వారి పరిధిలోని లబ్ధిదారులతో పాటు చిన్నారులకు పోషకాహారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సద్వినియోగం చేసుకోవాలి
- సౌజన్య, ఇన్ఛార్జి పీడీ, ఐసీడీఎస్
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలకు వంద శాతం మందికి పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రాజెక్టులు సీడీపీవోలు, అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఇక నుంచి కేంద్రాలకు రాలేని గర్భిణులు, బాలింతలకు వారి కుటుంబ సభ్యులొస్తే బాక్సుల్లో అన్నం, కూరలు పెట్టి ఇస్తారు. ఈ అవకాశాన్ని కేంద్రాలపరిధిలోని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..