చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
వింజమూరు: తెదేపాలో చేరుతున్న వైకాపా కో-ఆప్షన్ సభ్యులు రఫి
బిట్రగుంట, న్యూస్టుడే : చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు. వీరికి రవిచంద్ర, కావలి తెదేపా అభ్యర్థి వెంకట కృష్ణారెడ్డి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్ చౌదరి, మధుబాబునాయుడు, ఎం.నాగేశ్వరావు, వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. కావలి : తెదేపాతోనే రామరాజ్యం వస్తుందని ఆ పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ వస్త్ర సముదాయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి
వింజమూరు : ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యమని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. స్థానిక వీఆర్ ఫంక్షన్ప్లాజాలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు జి. శ్రీనివాస్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పని చేయాలన్నారు. పి. అంబేడ్కర్, ఎం. తిరుమలేసు, జి. వెంకటేశ్వర్లు, ఎం. సుజాత తదితరులు పాల్గొన్నారు.
వరికుంటపాడు: నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించడమే ధ్యేయమని తెదేపా అభ్యర్థి కాకార్ల సురేష్ తెలిపారు. మండలంలోని జడదేవి, తూర్పుచెన్నంపల్లె, అలివేలిమంగాపురం, తూర్పుబోయమడుగుల, గువ్వాడి, కాంచెరువు, ఇస్కపల్లె, నల్లబోతులవారిపల్లె, జి.కొండారెడ్డిపల్లెలో బుధవారం చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జి.గోపి, కె.శ్రీనివాసులు, పి.పుల్లయ్య, పాల్గొన్నారు. వింజమూరు : వైకాపాకు చెందిన మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ రఫి బుధవారం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు జి.రఘునాథరెడ్డి, జి. నరసారెడ్డి, సీహెచ్. వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
సీతారామపురం: మండలంలో కొన్ని పోలింగు కేంద్రాల్లో రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో వైకాపా నాయకులు ఉన్నారని ఉదయగిరి నియోజకవర్గ తెదేపా లీగల్సెల్ అధ్యక్షుడు సందిరెడ్డి రామారావు తెలిపారు. ఇదేవిషయమై ఉదయగిరి ఆర్వోకు, ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. తెదేపా ఇంటింటి ప్రచారం
కందుకూరు పట్టణం : సామాన్య, మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంటూరి నాగేశ్వరరావు అని, ఆయనకు పేదల బాధలు బాగా తెలుసని ఇంటూరి సౌజన్య అన్నారు. పట్టణంలోని 6వ వార్డు కోటకట్టవీధి, మక్కామసీదు ప్రాంతంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు డి.మల్లేశ్వరరావు, సయ్యద్ అహ్మద్బాషా, షేక్ మున్నా, ఫిరోజ్, పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ పిల్లల భవిష్యత్తు కోసం తెదేపాను గెలిపించండి
[ 30-04-2024]
మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని నెల్లూరు రూరల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. -
పింఛన్ల నీడ.. వైకాపా చీడ
[ 30-04-2024]
-
పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు
[ 30-04-2024]
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. -
దగాపడ్డ రైతు దళారీకే మద్దతు!
[ 30-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు. -
ప్రభుత్వ భూములు మింగేశారు
[ 30-04-2024]
వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. -
జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!
[ 30-04-2024]
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. -
అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమ రవాణా
[ 30-04-2024]
మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. -
పరిహారం పేరుతో జగన్నాటకం
[ 30-04-2024]
పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది. -
ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం
[ 30-04-2024]
మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం