పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
చెలరేగుతున్న మట్టి మాఫియా
నారంపేట ఉత్తరం వైపున్న తిప్పలను ఇష్టానుసారం తవ్వేసి తరలిస్తున్నారు. క్రమంగా అక్రమ తవ్వకాలు విస్తరిస్తున్నారు. ఇటువైపు చూసే అధికారులే లేరు.
ఆత్మకూరు, న్యూస్టుడే: ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా నిర్మించే రోడ్ల కోసం పక్కనే ఉన్న తిప్పలో తవ్వకాలు చేస్తున్నారు. వారి ధాటికి తిప్ప కరిగిపోతోంది. పనుల కోసమంటూ గుత్తేదారు తరలిస్తుండగా.. వారి మాటున అధికారమే అండగా.. మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఆత్మకూరులో కొత్తగా వెలుస్తున్న లేఅవుట్ల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని రాత్రుళ్లు యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దాంతో పారిశ్రామికవాడకు తూర్పువైపున ఉన్న తిప్పలు కరిగిపోతున్నాయి.
అనుమతులా? మాకెందుకు?
గ్రావెల్ తవ్వకాలకు గనులశాఖ అనుమతులు తప్పనిసరి. ఎంత లోతు? పరిమాణం? అనే వివరాలు స్పష్టం చేయాలి. ఆ సమాచారం రెవెన్యూ విభాగానికి తెలపాలి. వారు వచ్చి అనుమతులు ఉన్న ప్రాంతానికి హద్దులు చూపితే.. అందులో తవ్వుకోవాలి. ఇక్కడ అవేమీ లేవు. ఇష్టానుసారం చేస్తుండగా.. స్థానికులు విస్తుబోతున్నారు. వైకాపా అధికారం యువతకు ఉద్యోగాలు తెచ్చే పరిశ్రమలు తేకపోగా- కొల్లగొట్టి స్వాహా చేసేందుకు బాగానే ఉపయోగపడుతోందనే విమర్శలు నెలకొన్నాయి.
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు..
ఆత్మకూరు మండలం నారంపేట పారిశ్రామికవాడ ప్రాంతంలోని తిప్పల్లో గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పరిశీలించి, చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసరావు, ఏడీ, గనులు, భూగర్భవనరులశాఖ
వెంటనే పరిశీలిస్తాం
అక్కడ తవ్వకాలు చేయవద్దని గతంలోనే సూచించాం. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోసారి పరిశీలిస్తాం.
మధులత, ఆర్డీవో, ఆత్మకూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వోదయ అధ్యాపకునికి డాక్టరేట్
[ 30-04-2024]
పి.బి.ఆర్ విశ్వోదయా ఇంజనీరింగ్ కాలేజీలో సి.యస్.ఈ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న యం.ప్రవీణ్ కుమార్కు ఉత్తర్ప్రదేశ్కు చెందిన శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. -
మీ పిల్లల భవిష్యత్తు కోసం తెదేపాను గెలిపించండి
[ 30-04-2024]
మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని నెల్లూరు రూరల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. -
పింఛన్ల నీడ.. వైకాపా చీడ
[ 30-04-2024]
-
పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు
[ 30-04-2024]
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. -
దగాపడ్డ రైతు దళారీకే మద్దతు!
[ 30-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు. -
ప్రభుత్వ భూములు మింగేశారు
[ 30-04-2024]
వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. -
జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!
[ 30-04-2024]
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. -
అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమ రవాణా
[ 30-04-2024]
మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. -
పరిహారం పేరుతో జగన్నాటకం
[ 30-04-2024]
పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది. -
ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం
[ 30-04-2024]
మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి