జగదభిరామ.. జానకిరామ
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు.
వేడుకగా సీతారాముల కల్యాణం
కల్యాణమూర్తిగా స్వామివారు.. తిలకిస్తున్న భక్తులు
నెల్లూరు(సాంస్కృతికం): జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని కనులపండువగా జరిపించారు. 1వ అదనపు కోర్టు న్యాయమూర్తి కపర్థి, గాయత్రి దంపతులు, తెలుగుగంగ విశ్రాంత ఎస్ఈ హరినారాయణరెడ్డి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తితిదే కల్యాణ మండపంలో భక్తులకు భోజనాలు పెట్టారు. మందిర ఛైర్మన్ చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగిన కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న న్యాయమూర్తి, అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల నీడ.. వైకాపా చీడ
[ 30-04-2024]
-
పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు
[ 30-04-2024]
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. -
దగాపడ్డ రైతు దళారీకే మద్దతు!
[ 30-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు. -
ప్రభుత్వ భూములు మింగేశారు
[ 30-04-2024]
వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. -
జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!
[ 30-04-2024]
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. -
అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమ రవాణా
[ 30-04-2024]
మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. -
పరిహారం పేరుతో జగన్నాటకం
[ 30-04-2024]
పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది. -
ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం
[ 30-04-2024]
మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.