logo

రైతుల జీవితాల్లో నిత్య కాంతులు

సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజలు సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన పండగ శుభాకాంక్షలు

Published : 15 Jan 2022 03:16 IST

నిజామాబాద్‌ నగరం: సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజలు సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నాయకత్వంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థంగా ఎదుర్కొంటూ రైతుల జీవితాల్లో నిత్య కాంతులు నింపుతామన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని సూచించారు. జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి కూడా మరో ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని