తాళాలెలా తీస్తున్నారు?
నిజామాబాద్లో నెల రోజుల కిందట కొన్న ఓ ద్విచక్రవాహనం ఇటీవల అపహరణకు గురైంది. సాధారణంగా దీని తాళం తీయడం అంత సులువు కాదని పలువురు మెకానిక్లు చెబుతున్నారు. అందులోనూ కొత్తదైతే మరింత క్లిష్టమని పేర్కొంటున్నారు. కానీ,
కొత్త వాహనాలు సులువుగా చోరీ
న్యూస్టుడే - నిజామాబాద్ నేరవార్తలు
నిజామాబాద్లో నెల రోజుల కిందట కొన్న ఓ ద్విచక్రవాహనం ఇటీవల అపహరణకు గురైంది. సాధారణంగా దీని తాళం తీయడం అంత సులువు కాదని పలువురు మెకానిక్లు చెబుతున్నారు. అందులోనూ కొత్తదైతే మరింత క్లిష్టమని పేర్కొంటున్నారు. కానీ, ఓ దొంగ కేవలం నిమిషంలోనే తాళం తీసి సులువుగా ఎత్తుకెళ్లడం సవాలుగా మారింది. ఇదేకాదు.. అన్ని రకాల కంపెనీ వాహనాలను చోరులు అపహరించుకెళ్తుడటంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
మరాఠా ముఠాల పనే..
మహారాష్ట్రకు చెందిన పలు ముఠాలు ద్విచక్ర వాహనాలను చోరీలు చేయడంలో ఆరితేరాయి. ఎలాంటిదైనా తాళం లేకుండానే సులువుగా స్టార్ట్ చేస్తున్నారు. ఆటోల్లో ఇతర వాహనాల్లో ఎక్కించి అంతరాష్ట్ర సరిహద్దును దాటిస్తున్నారు. తెల్లవారితే గాని బాధితులు తమ వాహనం పోయిన విషయాన్ని గుర్తించకపోవడంతో చివరకు పోలీసులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది.
తక్కవ ధరకే..
తాజాగా ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకొన్న ఓ ద్విచక్ర వాహనం ధర ఇక్కడ రూ.40 వేల పైనే ఉంటుంది. నిందితులు మాత్రం అక్కడ దాన్ని రూ.10 వేలకు విక్రయించుకొన్నారు. దర్యాప్తులో ఈ విషయం వెలుగుచూసింది.
రికవరీ అంతంతే..
బండ్ల చోరీల్లో ద్విచక్ర వాహనాల కేసులే 90 శాతం పైబడి ఉంటున్నాయి. ఏటా 350 పైచిలుకు దొంగిలించబడుతున్నాయి. ఇందులో నిజామాబాద్ నగరంలోనే అత్యధికంగా 200 పైచిలుకు ఉంటున్నాయి. ఏటా మాయమవుతున్న వాటిల్లో కేవలం 30-40 శాతం మాత్రమే రికవరీ అవుతున్నాయి.
భద్రత ఎలా..
పార్కింగ్ చేసిన వాహనాలు క్షణాల్లో మాయమవుతుండటంపై వాటి భద్రత విషయంలో యజమానులు ఆందోళన చెందక తప్పట్లేదు. తాళాలు పక్కాగా లేనివి ఎత్తుకెళ్తే వాహనదారుల నిర్లక్ష్యంగా చెప్పొచ్చు. అన్నీ పక్కాగా ఉన్న కొత్తవీ అపహరణకు గురికావడంపై సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.
కట్టడికి వ్యూహం అవసరం
ద్విచక్ర వాహనాల అపహరణ కేసుల్లో పోలీసులు ముందస్తు కట్టడి వ్యూహం చేపట్టాల్సిన అవసరముంది. మహారాష్ట్ర ముఠాలు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలి.
* రాష్ట్ర సరిహద్దులు, రైల్వేస్టేషన్లలో సీసీఎస్ బృందాలతో గస్తీ చేయిస్తే అనుమానితులు చిక్కే వీలుంది.
* రాత్రివేళల్లో అనుమానిత వాహనాలు, ఆటోలపై తిరిగే వారిని నిలువరిస్తే చాలా వరకు సత్ఫలితాలుంటాయి.
* వారంలో ఒకరోజైనా రాత్రి 10 నుంచి వేకువజాము వరకు నాకాబందీ చేపడితే దొంగ వాహనాలు పట్టుబడే అవకాశం ఉంది.
* స్థానికంగా వరుసగా చోరీ కేసుల్లో ఉన్న నిందితులపై పీడీ ప్రయోగించడం ద్వారా ముఠాలను సులువుగా కట్టడి చేయొచ్చు. ఇటీవల నాలుగో ఠాణా పోలీసులు ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో అన్ని ఠాణాల పరిధిల్లో నిలువరించాల్సి ఉంది.
అక్కడ కొంటుండటంతో...
మన ప్రాంతంలో చోరీ వాహనాలను ఎవరూ కొనుగోలు చేయరు. మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం ఎలాంటి పత్రాలు లేకున్నా కొనేస్తుంటారు. అందుకే అక్కడి ముఠాలు రాత్రికి రాత్రి ఇక్కడ చోరీ చేసి మరుసటి రోజు తమ ప్రాంతాల్లోని బజార్లలో విక్రయించేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..