నడవాలంటే నరకమే
పెరుగుతున్న ధరలు.. నిరుద్యోగం.. ఇతర వర్తమాన అంశాలతోపాటు కుక్కలు ఒక సమస్య అయి కూర్చున్నాయి. వాటి నుంచి గట్టెక్కి ఇంటికి చేరుకుంటే.. కుక్క నుంచి తప్పించుకోవడం గగనమవుతోందని పౌరులు ఆవేదన చెందుతున్నారు. నియంత్రణ బాధ్యత నిర్వర్తించాల్సిన స్థానిక సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా
న్యూస్టుడే, బోధన్ పట్టణం
పెరుగుతున్న ధరలు.. నిరుద్యోగం.. ఇతర వర్తమాన అంశాలతోపాటు కుక్కలు ఒక సమస్య అయి కూర్చున్నాయి. వాటి నుంచి గట్టెక్కి ఇంటికి చేరుకుంటే.. కుక్క నుంచి తప్పించుకోవడం గగనమవుతోందని పౌరులు ఆవేదన చెందుతున్నారు. నియంత్రణ బాధ్యత నిర్వర్తించాల్సిన స్థానిక సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తలనొప్పి వ్యవహారమంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో వాటి నియంత్రణ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారించిన హైకోర్టు ప్రతి మున్సిపాలిటీలో కుక్కల జనన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఇదీ పరిస్థితి...
స్థానికంగా కుక్కల సంతతి వృద్ధి చెందడంతోపాటు ఆహారం దొరక్క పల్లెల నుంచి పట్టణాలకు వలసలుంటున్నాయి. పట్టణ శివార్లలోని ఫంక్షన్ హాళ్ల వద్ద ఆహార వ్యర్థాలు లభించినంత కాలం అక్కడ ఉంటున్నాయి. వేడుకలు లేనప్పుడు జనావాసాలకు తరలివస్తున్నాయి. పట్టణాల్లోనూ మాంసం విక్రయ కేంద్రాలు, ఆహారశాలల పరిసరాల్లో ఎక్కువగా సంచరిస్తూ క్రమంగా వీధుల్లోకి చేరుతున్నాయి. అలా వాటి సంఖ్య రెట్టింపవుతోంది. దీనికితోడు పొరుగున మహారాష్ట్ర నుంచి బలవంతపు వలసలు పెరిగిపోవడంతో సమస్య మరింత తీవ్రమైందన ఆందోళన వ్యక్తమవుతోంది.
నగరంలో ఒక్కటే..
ప్రస్తుతం నిజామాబాద్ నగరపాలక సంస్థ ఒకటే కు.ని చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్, ఆర్మూర్ బల్దియాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
ఏం చేస్తున్నారు?
నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ వ్యవహారం అధికారులందరిలోనూ భయం నింపింది. అక్కడ కుక్కలను చంపినందుకు సస్పెండ్ చేయడంతో నియంత్రణ చర్యల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. గతంలో పుర అధికారులు వాటిని పట్టుకెళ్లి ఇందల్వాయి సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేవారు. ఇది అనధికారికంగా కొనసాగిన ప్రక్రియ. నర్సాపూర్ ఘటనతో ఇలా తరలించే క్రమంలో ఏదైనా జరిగితే తమ మెడకు చుట్టుకుంటుందని వెనక్కితగ్గారు.
నిబంధనలేమి చెబుతున్నాయంటే..
నర్సాపూర్ ఘటన నేపథ్యంలో జంతు జనన నియంత్రణ, జంతు సంరక్షణ చట్టం ప్రకారం పురపాలకశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
* శునకాలను విషం ఇచ్చి చంపొద్దు.
* సుశిక్షితులైన వ్యక్తులు గాయం కాకుండా పట్టుకోవాలి.
* కు.ని చికిత్సకు ముందు, తరువాత విశ్రాంతికి గదులు ఏర్పాటు చేయాలి.
* చికిత్సను సీసీ కెమెరాల్లో నిక్షిప్తం చేసి ఆరు నెలలు కాపాడాలి.
* కేంద్రాల్లో వాటికి సరైన పోషకాహారం ఇవ్వాలి.
* జియో ట్యాగ్ వేయాలి.
కు.ని శస్త్రచికిత్సలు చేస్తున్నాం
సాజిద్ అలీ, ఇన్ఛార్జి ఎంహెచ్వో
కుక్కలను పట్టుకొచ్చి కు.ని ఆపరేషన్లు చేస్తున్నాం. మళ్లీ జూన్ 1 నుంచి శిబిరం ప్రారంభించాం. రోజుకు 5-6 వరకు ఆడ, మగ శునకాలకు చికిత్సలు చేసి ట్యాగ్ వేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ