నిర్వహణలో కొరవడిన కసరత్తు
జిల్లాకేంద్రంలో ఐదేళ్ల క్రితం పురపాలక శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. కండరాల ఆరోగ్యం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడానికి పరికరాలు బిగించారు.
ఓపెన్ జిమ్లను గాలికొదిలేసిన పుర యంత్రాంగం
ఆకతాయిల చేతిలో విరిగిన బల్ల
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం: జిల్లాకేంద్రంలో ఐదేళ్ల క్రితం పురపాలక శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. కండరాల ఆరోగ్యం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడానికి పరికరాలు బిగించారు. నిర్వహణ లేక.. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అనతికాలంలోనే పరికరాలు ధ్వంసం అయ్యాయి. కింద పరిచిన ప్రత్యేక మ్యాట్లను ఆకతాయిలు తొలగించారు.
కాపలాదారులు అవసరం
స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ వ్యాయామం చేసేందుకు వీలుగా రూ.లక్షలు వెచ్చించి ఓపెన్జిమ్లు ఏర్పాటు చేసినా.. రక్షణ కోసం ప్రహరీల నిర్మాణం, కాపలాదారుల నియామకం చేపట్టకపోవడంతో సమస్య ఏర్పడింది. ఫలితంగా అనేక కేంద్రాల్లో సాధకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాకేంద్రంలోని రాజీవ్ఉద్యానంలో బహిరంగ వ్యాయామశాలను రూ.7 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఇక్కడికి నిత్యం ఉదయం పూట నడక, జాగింగ్ చేయడానికి 100 మంది వరకు వస్తుంటారు. పరికరాలు విరిగిపోవడంతో వ్యాయామం చేయడానికి వీలు లేకుండా పోయింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
జిల్లాకేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు మధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలలో పరికరాలు ధ్వంసమయ్యాయి. నేల మీద పరిచిన ప్రత్యేక మ్యాట్లను ఆకతాయిలు ఎత్తుకెళ్లారు. దీని చెంతనే ప్రకృతివనం, మినీ ఉద్యానం ఉన్నా.. నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది.
ప్రత్యేకాధికారిని నియమిస్తాం
- దేవేందర్, పుర కమిషనర్, కామారెడ్డి
బహిరంగ వ్యాయామశాలల్లో కొన్ని పరికరాలు పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపడతాం. ఈ విషయమై కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలకు వసతుల కల్పనలో లోపాలకు తావివ్వకుండా పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక అధికారులను నియమిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు