దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
నియోజకవర్గంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అధికారులకు సూచించారు.
అధికారులతో సమీక్షిస్తున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్
బోధన్ గ్రామీణం, న్యూస్టుడే: నియోజకవర్గంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అధికారులకు సూచించారు. ఆర్డీవో రాజేశ్వర్, పుర కమిషనర్ ఖమర్ అహ్మద్, తహసీల్దార్ వరప్రసాద్తో పాటు మండలస్థాయి అధికారులతో ఉత్సవాల నిర్వహణపై గురువారం తన నివాసంలో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 22 వరకు నిర్వహించే కార్యక్రమాల అమలును పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు సాయం
బోధన్ గ్రామీణం, న్యూస్టుడే: భారాసలో పనిచేసి మృతిచెందిన పలువురు కుటుంబాలకు ఎమ్మెల్యే షకీల్ వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పాలేవార్ సాయినాథ్, మావందిఖుర్దు మాజీ సర్పంచి రాజు, సాలూరకు చెందిన అనిత అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. సాయినాథ్ కుటుంబానికి రూ.లక్ష, మరో ఇద్దరికి రూ.50వేల చొప్పున ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆయా కుటుంబాలకు గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగదు అందజేశారు. బెల్లాల్ గ్రామానికి చెందిన వరమ్మ మృతి చెందగా ఆమె కుటుంబానికి పార్టీ పరంగా మంజూరైన బీమా సొమ్ము రూ.2లక్షలు అందించారు. కార్యక్రమంలో భారాస నాయకులు గంగారెడ్డి, బుద్దె రాజేశ్వర్, రవీందర్యాదవ్, శరత్, నర్సయ్య, సంజీవ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీమా చెక్కు అందజేత
అభంగపట్నం (నవీపేట), న్యూస్టుడే: అభంగపట్నానికి చెందిన సాదుల సంతోష్ గతేడాది స్థానిక చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. బాధితుడికి రూ.2 లక్షల భారాస ప్రమాద బీమా చెక్కు మంజూరు కాగా బోధన్లోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే షకీల్ గురువారం ఆ చెక్కు అందజేశారు. ఎంపీపీ శ్రీనివాస్, నవీపేట సొసైటీ ఛైర్మన్ అబ్బన్న, సతీష్, ఉమర్, అప్సర్, అలీం, సురేష్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
-
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.