జాడలేని సాయంత్రం క్లీనిక్లు
యూపీహెచ్సీ స్థాయిలో స్పెషాలిటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాయంత్రం క్లీనిక్లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. నెలకొల్పిన తర్వాత ఒకటి, రెండు నెలలలోపే మూతపడ్డాయి.
రాకాసిపేటలో సాయంత్రం క్లీనిక్ నిర్వహించిన యూపీహెచ్సీ
న్యూస్టుడే, బోధన్ పట్టణం: యూపీహెచ్సీ స్థాయిలో స్పెషాలిటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాయంత్రం క్లీనిక్లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. నెలకొల్పిన తర్వాత ఒకటి, రెండు నెలలలోపే మూతపడ్డాయి. గతేడాది ఇదే సమయంలో వీటిని అట్టహాసంగా ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కానీ కొన్ని కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో ఆదరణ లేకపోవడం, ఆరోగ్య మిషన్ నుంచి నిధుల కేటాయింపు లేక వీటిని అర్ధాంతరంగా అనధికారికంగా నిలిపివేశారు. నిజామాబాద్ నగరంలో మూడు, బోధన్లో ఒక యూపీహెచ్సీలో వీటిని ఏర్పాటు చేసి ఎత్తేశారు.
ఇదీ పరిస్థితి: వైద్య వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. వ్యాధులు ప్రాణాంతకం కాక మునుపే ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నియంత్రించడానికి పలు కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటిలో ఒకటి ఈ సాయంత్రం క్లీనిక్. యూపీహెచ్సీల్లో వారంలో మూడు రోజుల పాటు క్లీనిక్లు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక స్పెషాలిటీ వైద్య నిపుణుడు అందుబాటులో ఉంటారు. వారిలో స్త్రీ, పిల్లల వైద్య నిపుణులు, ఫిజిషీయన్ ఒక్కో రోజు ఒకరు సేవలందిస్తారు. వీరికి ఒక రోజుకు 20 మందికి పైగా ఓపీ నమోదైతే వైద్యులకు రూ.3 వేలు, స్టాఫ్నర్సుకు రూ.200, నాలుగో తరగతి ఉద్యోగికి రూ.100 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కానీ ఇక్కడికి రోగులు 20 మంది కంటే తక్కువగానే వస్తున్నారని గుర్తించారు. బోధన్లో మాత్రం 20కి పైగా వచ్చినట్లు చెబుతున్నారు.
సరైన వైద్యం అందే వీలు: జనం నుంచి సరైన స్పందన లేదనే భావన ఉన్నతాధికారుల్లో వ్యక్తమవడంతో వీటిని నిలిపివేశారు. ఇక చేసిన పనికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. ఈ విషయంలో వైద్యాధికారులను సంప్రదిస్తే స్పందించడానికి నిరాకరించారు. వైద్య నిపుణుల సేవలు స్థానికంగా అందుబాటులో ఉంటే పట్టణం, నగరంలోని మారుమూల కాలనీవాసులకు ఇవి ప్రయోజనకరంగా ఉండేవి. బస్తీల్లో పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకునే వారు ఆ సమయంలో స్పెషాలిటీ డాక్టర్లు ఉండటంతో పరీక్షలు చేయించుకుని ప్రాథమిక స్థాయిలోనే సరైన వైద్యం అందుకునే వీలు ఉండేది. అధికారులు స్పందించి వీటిని తిరిగి తెరవాలని బోధన్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు