డబ్బులు ఎప్పుడొస్తాయో..!
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు.
ధరణిలో స్లాట్ రద్దు చేసుకుని రైతుల ఎదురుచూపులు
కామారెడ్డి సంక్షేమం, న్యూస్టుడే
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. రూ.31 వేల రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో ప్రభుత్వానికి చెల్లించారు. భూమి డీల్ క్యాన్సిల్ కావడంతో స్లాటును రద్దు చేసుకున్నారు. సదరు స్లాటు డబ్బులు ఇప్పటికీ రాలేదు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు.’
‘జిల్లాకేంద్రానికి చెందిన శ్రీనివాస్ దోమకొండ మండలంలో భూమి కొనుగోలు కోసం రెండేళ్ల క్రితం స్లాట్ బుక్ చేసుకున్నాడు. డాక్యుమెంట్లో ఆధార్ నంబరు తప్పుగా నమోదు కావడంతో భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. తప్పులను సవరించే అవకాశం లేకపోవడంతో స్లాటు రద్దు చేసుకుని మరో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాడు. మొదట రద్దు చేసుకున్న స్లాటు డబ్బులు ఇప్పటికీ రాలేదు.’
ధరణి స్లాట్ బుకింగ్ డబ్బులు రైతులకు తిరిగి వాపస్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాదాపు మూడేళ్ల నుంచి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మంది రైతులు ఎదురుచూస్తున్నారు. స్లాట్ బుకింగ్ సమయంలో భూమి మార్కెట్ విలువను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజును రైతులు, స్థిరాస్తి వ్యాపారులు ఆన్లైన్లో చెల్లిస్తున్నారు. స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇచ్చే విధానం ధరణిలో లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడంతో స్లాటు రద్దు చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వ హయాంలోనైనా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
సవరణకు అవకాశం లేక..
స్లాట్లు రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం ధరణి వెబ్సైట్లో సవరణల ఐచ్ఛికం ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. స్లాట్ బుక్ చేసిన తర్వాత తప్పులు దొర్లడంతో చాలా మంది స్లాట్లు రద్దు చేసుకున్నారు. ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో జరిగిన పొరపాట్లను సవరించే అవకాశం లేకుండా పోయింది. అప్పట్లో పేరు, చిరునామా, ఆధార్ నంబరు వంటి వివరాలు ఒకసారి నమోదు చేసి సబ్మిట్ చేశాక తప్పులుంటే సవరించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆధార్ నంబరు సవరించడానికి ఎడిట్ ఆప్షన్ లేదు. కేవలం పేరు, చిరునామాలకు మాత్రమే ఐచ్ఛికం ఇచ్చారు. మరో కారణం ఏమిటంటే భూవిక్రయ ఒప్పదం రద్దు కావడం. విక్రయించాలనుకునే వ్యక్తి చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకోవడం లేదా ధరల విషయంలో ఇరువురి మధ్య అవగాహన కుదరక స్లాట్లు రద్దయ్యాయి.
ఖాతాలో జమ చేస్తామన్నారు
స్లాట్ రద్దయిన వారికి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని గత ప్రభుత్వం పేర్కొంది. దీంతో స్లాట్లు రద్దు చేసుకున్నవారు ధరణి పోర్టల్లో క్యాన్సిల్ ఆప్షన్ కింద వివరాలు నమోదు చేయించుకున్నారు. వీరందరికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో డబ్బులు అందజేస్తామని చెప్పారు. కాని మూడేళ్లు గడిచినా డబ్బులు రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్లో చేరికలు
[ 27-04-2024]
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
[ 27-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, -
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్