స్తబ్దుగా సలహా సంఘాలు
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది.
ఈనాడు, కామారెడ్డి: ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా గ్రామాల్లో ఇందిరమ్మ, ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల నియామకాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఆసుపత్రులు, పాఠశాలలు, రైతుబంధు, పౌరసరఫరాలు, పురపాలికల్లో వార్డు కమిటీలు, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో స్థానికులను భాగస్వాములు చేస్తూ కమిటీలు ఏర్పాటయ్యాయి. పాలకులు, అధికారులు పట్టించుకోక ఇవి కాస్తా నియామకాలకు పరిమితమవుతున్నాయి. నెలల తరబడి సమావేశాలు నిర్వహించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. ప్రస్తుతం ఏర్పాటవుతున్న కమిటీలైనా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరముంది.
వ్యవసాయ సాంకేతిక కమిటీలు డీలా..
సాగు, పాడిరంగంలో కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీలు ఏర్పాటుచేశారు. ఇందులో నియోజకవర్గస్థాయి ఉత్తమ రైతులను సభ్యులుగా చేర్చారు. ఆత్మ ఆధ్వర్యంలోని కమిటీలు రైతులకు సూచనలివ్వాలి. కానీ ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు.
ఆసుపత్రుల్లో ఇలా..
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంగా పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా దవాఖానాల్లో ప్రభుత్వం సలహా సంఘాలు ఏర్పాటుచేసింది. పీహెచ్సీ, ఏరియా ఆసుపత్రులకు ఎమ్మెల్యేలు అధ్యక్షుడిగా, జిల్లా ఆసుపత్రులకు జిల్లా పరిషత్ ఛైర్మన్ను అధ్యక్షుడిగా నియమించింది. ఇందులో ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా తీసుకుంది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో సలహా సంఘం సమావేశాలను ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రెండు సార్లు మాత్రమే సమావేశాలు నిర్వహించి మిగిలిన దఫాలు నిర్వహించినట్లు కాగితాల మీద రాసుకున్నారని ఆరోపించారు.
ప్రజాపంపిణీ తీరుతెన్నులపై..
ప్రజాపంపిణీలో సక్రమంగా సరకులను ప్రజలకు చేరవేసేందుకు ఆహార సలహా సంఘాలున్నాయి. అక్రమాలకు తావివ్వకుండా కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలి. జిల్లా, మండల, గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన సంఘాలు మూడు నెలలకోసారి ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరును సమీక్షించాలి.
క్రియాశీలకంగా పనిచేస్తేనే ఫలితం
పురపాలికల్లో ప్రతి వార్డులో 16 మందితో అభివృద్ధి కమిటీలున్నాయి. ఇవి ఏర్పాటై అయిదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఒక్క సమావేశం ఏర్పాటుచేయలేదు. ఇదే మాదిరిగా రైతుబంధు సమన్వయ సమితి, నీటి వినియోగదారుల సంఘాలు, పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నియమించే కమిటీలైనా శ్రద్ధపెట్టి పనిచేస్తే నియామకాలకు సార్థకత చేకూరతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్లో చేరికలు
[ 27-04-2024]
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
[ 27-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, -
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు