బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
శ్రీకాంత్
నిజామాబాద్ నేరవిభాగం, న్యూస్టుడే: బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. యువతి మెడలో ఉన్న ప్రైవేటు కళాశాల గుర్తింపు కార్డు ఆధారంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నందిత(20)గా ఇప్పటికే రైల్వే పోలీసులు గుర్తించారు. యువకుడి వద్ద ఏ ఆధారాలు లభించకపోవడంతో గుర్తించేందుకు సమయం పట్టింది. యువకుడి చరవాణి పరిశీలించగా నిజామాబాద్ నగరానికి చెందిన సూరం శ్రీకాంత్(28)గా తేలింది. ఆయన కోటగల్లీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వారిది పేద కుటుంబం. తండ్రి ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. శ్రీకాంత్, నందిత గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. యువతి చదువులో చురుగ్గా ఉండేదని స్నేహితులు చెబుతున్నారు. యువకుడు సైతం నిజాయతీగా ఉండేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
పెళ్లి వాహనం బోల్తా
12 మందికి గాయాలు
లింగంపేట, న్యూస్టుడే: లింగంపేట మండలం లింగంపల్లి (ఖుర్దు) గ్రామ సమీపంలో గురువారం కామారెడ్డి- ఎల్లారెడ్డి రహదారిపై పెళ్లి వాహనం బోల్తాపడటంతో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి గ్రామానికి చెందిన కొత్త కిషన్ కుమారుడి వివాహం స్థానిక జీఎన్ఆర్ ఫంక్షన్ హాలులో జరిపించారు. బంధువులు ఓ వాహనంలో లింగంపల్లి నుంచి ఫంక్షన్ హాలుకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడినట్లు ఎస్సై చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. ప్రమాదంలో లింగంపల్లి గ్రామానికి చెందిన కొత్త సావిత్రి, కొత్త ఆదిత్య, కొత్త కిషన్, రాములు, శ్రీవర్ష, సత్యవతి, వడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన తిరుపతి, రాజేశ్వర్, రెడ్డిపేటకు చెందిన లక్ష్మి, గాంధారికి చెందిన అంజయ్య, రాములు, అంజవ్వ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో క్షతగాత్రులు, కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి.
కానిస్టేబుల్పై కత్తితో దాడి
రామారెడ్డి, న్యూస్టుడే: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించిన ఘటన రామారెడ్డి ఠాణాలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన బిట్ల రవి గురువారం తెల్లవారుజామున తల్లిదండ్రులతో గొడవ పడగా వారు ఠాణాకు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. కానిస్టేబుల్ సిద్ధిరాములు వివరాలు ఆరా తీస్తుండగా రవి ఒక్కసారిగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఠాణాలోని అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్ సిద్ధిరాములును కత్తితో గాయపర్చగా ఆయనకు చేతిపై స్వల్ప గాయమైంది. ఏఎస్సై రవీందర్, కానిస్టేబుల్ గణేష్లను కూడా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. గతంలోనూ పోలీసులను దూషించడంతో రవిపై రెండు సార్లు కేసులు నమోదు చేశారు.
ఎస్సైని తోసేసిన మందుబాబులు
పెద్దకొడప్గల్: విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సైని మద్యం మత్తులో ఉన్న యువకులు తోసేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిచ్కుంద ఎస్సై మోహన్రెడ్డి వివరాల మేరకు... పెద్దకొడప్గల్ మండల పరిధిలోని బేగంపూర్ టీరోడ్డు 161వ జాతీయ రహదారిపై ఎస్సై కోనారెడ్డి, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా కాస్లాబాద్కు చెందిన 9 మంది యువకులు సమీప దాబాలో మద్యం తాగి రోడ్డు మీదకు వచ్చారు. వాహనాలు తనిఖీ చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు.
ఆర్టీసీ బస్సులో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మృతి
మెట్పల్లి, న్యూస్టుడే : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి అస్వస్థతకు గురై మృతిచెందిన సంఘటన మెట్పల్లిలో గురువారం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి బోగం సామయ్య (70) నిజామాబాద్ జిల్లాలోని వినాయకనగర్లో స్థిరపడ్డారు. పని నిమిత్తం వీణవంక వెళ్లిన సామయ్య హుజూరాబాద్ డిపో బస్సులో సోదరితో కలిసి నిజామాబాద్ బయల్దేరాడు. మెట్పల్లి శివారులోని పెట్రోల్బంక్ వద్ద అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకులాడు. వెంటనే అంబులెన్స్కు సమాచారమివ్వగా 108 సిబ్బంది వచ్చి మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్లో చేరికలు
[ 27-04-2024]
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
[ 27-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, -
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ