లక్ష్య సాధనలో పరుగులు
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి.
మార్కెట్ ఫీజు వసూళ్లలో ముందంజ
జిల్లా వ్యవసాయోత్పత్తుల విక్రయాలు ఆశాజనకం
మానిక్బండార్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రం
న్యూస్టుడే, నిజామాబాద్ వ్యవసాయం: జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడటంతో మార్కెటింగ్ శాఖ ఆయా కమిటీలకు నిర్దేశించిన లక్ష్యాలు దాటి పరుగులు పెడుతున్నాయి. ఒక్క నిజామాబాద్ యార్డు కాస్తా వెనుకంజలో ఉన్నప్పటికీ ఈ నెలాఖరుకు అది కూడా దాటే అవకాశాలున్నాయి. ఈ నెలలోనే పసుపు విక్రయాలు 2 లక్షల క్వింటాళ్ల వరకు ఉండటంతో ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
పది శాతానికి పైగానే..
మార్కెటింగ్ శాఖ గతేడాది మార్కెట్ల వారీగా వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఏడాదికి లక్ష్యాలు నిర్దేశిస్తుంది. అందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రూ.17.95 కోట్లు ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఫిబ్రవరి నెలాఖరుకే రూ. 18.77 కోట్లు దాటిపోయింది. దాదాపు నాలుగున్నర శాతం అదనంగా చేరింది. ఈ నెలలో పసుపు క్రయవిక్రయాలు ఎక్కువగా ఉండటంతో మరో రూ.3 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తయితే 10 శాతం అదనంగానే వసూళ్లు జరిగే వీలుంది. బోధన్, ఆర్మూర్, వర్ని, కమ్మర్పల్లి, కోటగిరి, వేల్పూర్ మార్కెట్ కమిటీల్లో గణనీయంగా వసూళ్లు అయ్యాయి. అయితే మొత్తం వసూళ్లలో నిజామాబాద్ కమిటీదే 70 శాతం మేర ఉండడం గమనార్హం.
ధాన్యం కొనుగోళ్లతో మరో రూ. 20 కోట్లు
నిజామాబాద్, బోధన్, వర్ని మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో మూడేసి తనిఖీ కేంద్రాలు (చెక్పోస్టులు), ఆర్మూర్, కమ్మర్పల్లి, కోటగిరి, వేల్పూర్ కమిటీలకు రెండేసి తనిఖీ కేంద్రాలున్నాయి. మొత్తంగా జిల్లాలో 17 చెక్పోస్టుల ద్వారా వ్యవసాయోత్పత్తుల విక్రయాలపై పకడ్బందీగా పర్యవేక్షణ చేయడంతో అనుకున్న లక్ష్యాలు సాధించారు. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఏటా రెండు సీజన్లకు కలిపి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సొసైటీలు, మెప్మా, ఐడీసీఎంఎస్ సంస్థలు కొనుగోలు చేస్తే వాటి ద్వారా కూడా మార్కెటింగ్ శాఖకు ఫీజు వసూలవుతుంది. దీనిని నేరుగా వచ్చే ఆదాయంగా లక్ష్యాల్లో పొందుపరచడం లేదు. ఇదో రూ.20 కోట్ల వరకు ఏటా వచ్చే వీలుంది. మొత్తంగా మార్కెటింగ్ శాఖకు రూ.40 కోట్ల ఆదాయం సమకూరుస్తున్నారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
జిల్లాలో అన్నీ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఈ ఏడాది నిర్దేశించిన వసూళ్ల లక్ష్యాలు సాధించాయి. ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బందితో సమీక్షించి, పర్యవేక్షించడం ద్వారా సఫలీకృతమయ్యాం. ఇందులో నిజామాబాద్ యార్డుదే ప్రధాన భూమిక. పసుపు విక్రయాలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ మార్కెట్ లక్ష్యం ఈ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది.
గంగుబాయి, జిల్లా మార్కెటింగ్ అధికారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్లో చేరికలు
[ 27-04-2024]
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
[ 27-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, -
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM