ఓటేయాలి.. చైతన్యం చాటాలి
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
స్వీప్ ద్వారా ముమ్మరంగా కార్యక్రమాలు
న్యూస్టుడే, నిజామాబాద్ కలెక్టరేట్: లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓటింగ్ శాతానికి మించి మే 13న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో ఎక్కువ మంది ఓటు వేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాలు, పట్టణాలు, నగరం ఇలా అన్నిచోట్ల అవగాహన కార్యక్రమాలు జోరుగా చేపడుతున్నారు.
ఏప్రిల్ 15 వరకు అవకాశం
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాల్లో స్వీప్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 15 వరకు నమోదుకు అవకాశం ఉందని వివరిస్తున్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని వివరిస్తున్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పురపాలక సంఘాల్లో 5కె పరుగు నిర్వహించారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు, సీనియర్ సిటిజన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలపై దృష్టి
అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువగా ఓటింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. నిజామాబాద్ అర్బన్లో 289 కేంద్రాలుంటే ఇందులో 21 చోట్ల తక్కువ ఓటింగ్ శాతం నమోదైందని అధికారులు గుర్తించారు. ఈ సారి ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. వీటి పరిధిలోని కాలనీ అభివృద్ధి కమిటీలు, అపార్ట్మెంట్ కమిటీలు, మహిళా సంఘాలు, సీనియర్ సిటిజన్లతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే...
2023 నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో అత్యధికంగా 81.29 శాతం, నిజామాబాద్ అర్బన్లో అతితక్కువగా 61.67 శాతం నమోదైంది. ఆర్మూర్లో 76.02, బోధన్లో 77.82, నిజామాబాద్ గ్రామీణంలో 76.43, బాల్కొండలో 79.72 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటింగ్ వేశారు. అత్యల్పంగా నమోదైన ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు గోడ రాతలు, కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
విద్యార్థులకు అవగాహన
భవిష్యత్తు ఓటరు ప్రస్తుత విద్యార్థి కావడంతో వారికి ముందుగా అవగాహన కల్పిస్తున్నారు. 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు ఓటరు సంకల్ప పత్రాలు పంపిణీ చేశారు. ఇంటికి తీసుకవెళ్లి తల్లిదండ్రులతో ఓటు వేస్తామని ఆ పత్రంలో రాసి సంతకం చేయించి తిరిగి అధికారులు తీసుకున్నారు. ఇలాంటి పత్రాలను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఇది అన్ని పాఠశాలల్లో చేపట్టారు.
నిజామాబాద్ నగరంలో ఓటరు అవగాహనపై
నిర్వహించిన 5కే పరుగులో పాల్గొన్న క్రీడాకారులు
బాధ్యతగా భావించాలి
ఓటరు జాబితాలో పేరున్న వారు తప్పక హక్కును వినియోగించుకోవాలి. మే 13వ తేదీన ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయాలి. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి.
సురేష్ కుమార్, స్వీప్, నోడల్ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్లో చేరికలు
[ 27-04-2024]
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
[ 27-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, -
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM