గురువు మరణ వార్త విని.. 600 కిలోమీటర్ల పాదయాత్ర
ఢెంకనాల్ జిల్లా జోరంద నుంచి దాదాపు 600 కిలో మీటర్లు పాదయాత్ర చేసి, నవరంగపూర్ జిల్లా జొరిగావ్ సమితి దొడ్రలో ఉన్న ఆశ్రమానికి ఆదివారం ఉదయం ఇంద్రమణి బాబా తన శిష్య బృందంతో చేరుకున్నారు.
ఇంద్రమణ బాబా తన శిష్యులతో..
నవరంగపూర్, న్యూస్టుడే: ఢెంకనాల్ జిల్లా జోరంద నుంచి దాదాపు 600 కిలో మీటర్లు పాదయాత్ర చేసి, నవరంగపూర్ జిల్లా జొరిగావ్ సమితి దొడ్రలో ఉన్న ఆశ్రమానికి ఆదివారం ఉదయం ఇంద్రమణి బాబా తన శిష్య బృందంతో చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దొడ్ర ఆశ్రమానికి చెందిన ధనుంజయ్ బాబా శిష్యుడు ఇంద్రమణిబాబా జోరుదలో ఫిబ్రవరిలో జరిగిన మాఘమేళాకు పాదయాత్రగా డిసెంబర్ 29న బయలుదేరి, జనవరి 29న చేరుకున్నారు. అక్కడ వివిధ సభల్లో పాల్గొని, మేళాను దర్శించుకొని కొన్ని నెలలు ఆశ్రమ పద్ధతులను బోధించి తిరిగి వస్తానని అనుకున్న ఇంద్రమణిబాబా హఠాత్తుగా ఫిబ్రవరి 25న గురువు ధనుంజయ్ బాబా మరణ వార్త విన్నారు. వెంటనే పాదయాత్ర ప్రారంభించి 30 రోజుల నడిచి ఆదివారం నాటికి ఆశ్రమానికి చేరుకున్నారు. ఇంద్రమణి బాబా మీడియాతో మాట్లాడుతూ.. తన గురువు మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు. వెంటనే తన గురువు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని, ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తు బాధ్యతలు చూసుకుంటానని పేర్కొన్నారు. జిల్లాలో మెడికల్, డిగ్రీ కళాశాల స్థాపన కోసం ధర్మానుసారంగా ఉద్యమిస్తానని తెలిపారు.
పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న బాబా శిష్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా అమ్మాయికే మీ ఓటు..!
[ 08-05-2024]
ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. -
సంక్షేమ కార్యక్రమాలు ఆగవు
[ 08-05-2024]
భాజపా అధికారానికొస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బిజద నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మొద్దని భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, కేంద్రపడ లోక్సభ అభ్యర్థి బైజయంత్ పండా చెప్పారు. -
65 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్
[ 08-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో మే 13న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 65 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో 48 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. -
భాజపా తరఫున ప్రచారానికి ‘హేమ’హేమీలు
[ 08-05-2024]
బాలీవుడ్ స్టార్ హేమమాలిని భాజపా తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. -
నువ్వా... నేనా
[ 08-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొరాపుట్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంటోంది. బిజద, కాంగ్రెస్, భాజపాలు విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోపాల్పూర్లో బిజద బల ప్రదర్శన
[ 08-05-2024]
గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్ రోడ్షో దీనికి వేదికైంది గోపాల్పూర్ సెల్ఫీ పాయింట్ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు. -
బిజద ఆరిపోతున్న దీపం: ధర్మేంద్ర
[ 08-05-2024]
రాష్ట్రాన్ని రెండు పుష్కరాలుగా పాలిస్తున్న సీఎం నవీన్ రిమోట్ చెప్పిందే చేస్తారని, అండలేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. -
అనుకూలించిన వాతావరణం.. అభ్యర్థుల్లో ఉత్సాహం
[ 08-05-2024]
పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్