గవర్నరుగా రఘుబర్ దాస్
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా అగ్రనేత రఘుబర్ దాస్ ఒడిశా 26వ గవర్నరుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. 1955 మే 3న జంషెడ్పూర్ (ఝార్ఖండ్)లో జన్మించిన ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
భువనేశ్వర్, న్యూస్టుడే: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా అగ్రనేత రఘుబర్ దాస్ ఒడిశా 26వ గవర్నరుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. 1955 మే 3న జంషెడ్పూర్ (ఝార్ఖండ్)లో జన్మించిన ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో జనతా పార్టీలో ఉన్న ఆయన 1980లో భాజపాలో చేరారు. 1995 నుంచి అయిదుసార్లు జంషెడ్పూర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో ఝార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన ఆయన 2014-19లో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం భాజపా కేంద్ర శాఖ ఉపాధ్యక్షునిగా ఉన్న ఆయనకు గవర్నరు పదవి వరించింది. బీఎస్సీ, బీఎల్ చదివిన దాస్ రాజకీయాల్లోకి రాక ముందు జంషెడ్పూర్లోని టాటా స్టీల్ రోలింగ్ మిల్లో పనిచేశారు.
ప్రజల హృదయాల్లో నిలిచిన గణేశీలాల్
రాజ్యాంగ పరిధిలో ఉన్న గవర్నర్లు రాజ్భవన్లకే పరిమితంగా ఉంటారని, ప్రజలకు దూరంగా ఉంటారన్న వాదనలకు భిన్నంగా ఆచార్య గణేశీలాల్ రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మీయునిగా నిరూపించుకున్నారు. 2018 మే 25న గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీ కాలం (అయిదేళ్లు) ఈ ఏడాది మే 29న ముగిసింది. తర్వాత కేంద్రం వ్యవధి పొడిగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన హరియాణావాసి. ప్రముఖ వర్సిటీల్లో ఆచార్యునిగా గతంలో విధులు నిర్వహించారు. ఆరెస్సెస్తో సన్నిహిత సంబంధాలున్న ఆయన హరియాణ ఏబీవీపీ అధ్యక్షునిగా, కేంద్ర భాజపా క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా విధులు నిర్వహించారు. 1976 ఎమర్జన్సీలో కొన్నాళ్లు కారాగారంలో ఉన్నారు. సిర్సా అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎన్నికైన ఆయన మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఒడిశాలో గణేశీలాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్భవన్కే పరిమితం కాకుండా ప్రజల మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కులపతి (ఛాన్స్లర్) హోదాలో విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు సందర్శించి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లో ఒడియా భాష నేర్చుకున్న ఆయన జగన్నాథుని ప్రియభక్తునిగా ముద్రపడ్డారు. సంగీత, సాహిత్య రంగాల్లో ప్రావీణ్యం గల ఆయన తన పదవీ కాలంలో వివాదాల జోలికి వెళ్లలేదు. అధికార, విపక్షాల నాయకులందరి మన్ననలు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచి వదిలేస్తారా?.. సమస్యలు పరిష్కరిస్తారా?
[ 09-05-2024]
కంటాబంజి... బొలంగీర్ జిల్లాలోని ఈ ప్రాంతం వలసలకు చిరునామా. తరాల మారినా తమ తలరాతలు మారలేదని ఉసూరుమనే ప్రజలు రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తూ కుటుంబాలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నారు. -
రామరాజ్యం భాజపా ధ్యేయం
[ 09-05-2024]
రామరాజ్యం సుభిక్షానికి మరో పేరని, 500 ఏళ్ల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామాలయం నిర్మాణమైందని, కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్ష నెరవేర్చిన మోదీ పాలనా ఫలాలు ప్రతి వ్యక్తి ముంగిళ్లకు చేర్చాలని అహరహం శ్రమిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. -
28 నియోజకవర్గాల్లో 70 మంది కోటీశ్వరులు
[ 09-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్న 28 శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 70 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం: ఐదుగురి అరెస్టు
[ 09-05-2024]
బ్రహ్మపుర బైద్యనాథపూర్ (బిఎన్.పూర్) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికతో మత్తుమందు కలిపిన శీతల పానీయం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. -
అధికార పార్టీకి ఎన్నికల అధికారి కొమ్ముకాస్తున్నారు: కోడూరు
[ 09-05-2024]
కలెక్టర్, ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు ఆరోపించారు. -
ఒడిశా రాజకీయాల్లో చారిత్రక మలుపు ఈ ఎన్నికలు
[ 09-05-2024]
ఒడిశా రాజకీయాల్లో ఈ ఎన్నికలు చారిత్రక మలుపు తిప్పుతాయని, బ్రహ్మపురలో ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలివచ్చిన జన సందోహం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. -
సీఎం... గుమస్తా చేతిలో రిమోట్: ధర్మేంద్ర
[ 09-05-2024]
ఒక రాష్ట్రాన్ని బాగు చేయడానికి అయిదేళ్లు చాలునని, నవీన్ పట్నాయక్కు ఒడిశా ప్రజలు 24 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేకపోవడం ఆయన చేతగానితనం కాదా? అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
9 మంది మావోయిస్టుల లొంగుబాటు
[ 09-05-2024]
బౌద్ధ్ ఎస్పీ కార్యాలయంలో దక్షిణ మండల ఐజీ జయనారాయణ పంకజ్ సమక్షంలో బుధవారం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
-
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు