రాయగడ మీదుగా వందేభారత్?
రాయగడ మీదుగా ప్రతిష్ఠాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడవనుందా అంటే అవునన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
దుర్గు - విశాఖ మధ్య నడిపే అవకాశాలు
వందే భారత్ రైలు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాయగడ మీదుగా ప్రతిష్ఠాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడవనుందా అంటే అవునన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ - ఏపీ (దుర్గు - విశాఖ) రాష్ట్రాల మధ్య దీనిని నడిపేందుకు రైల్వే అధికారులు ప్రతిపాదించినట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల అనంతరం దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేగనక జరిగితే ఈ మూడు రాష్ట్రల ప్రజలతోపాటు ఏపీ రాష్ట్రంతో అనుబంధమున్న ఒడిశా, ఛత్తీస్గఢ్ తెలుగు వాళ్లకు ఎంతగానో ఉపయోగపడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 565 కి.మీ. పొడవున్న దుర్గు - విశాఖ మధ్య కేవలం 8 గంటల 30 నిమిషాలలో ప్రయాణించే వీలుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దుర్గులో ఉదయం 6 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. విశాఖలో మధ్యాహ్నం 3.15కి తిరిగి బయలుదేరి రాత్రి 11.50కు దుర్గు చేరుకుంటుందని చెబుతున్నారు. వందేభారత్తో దుర్గు-విశాఖ మధ్య స్టాపేజీలను 11కి కుదించే వీలుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుండడం గమనార్హం.
ఈ స్టేషన్లలో నిలుపుదల
దుర్గు - విశాఖ మధ్య నడవనున్న ఈ రైలు రాయిపూర్, లఖోవి, మహాసముంద్, ఖారియర్ రోడ్, కంటాబంజి, టిట్లాగఢ్, కెసింగ, సింగ్పూర్ రోడ్, రాయగడ, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లలో నిలిపే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. రాయగడను రైల్వే డివిజన్ ప్రకటించి, దీనికి సంబంధించి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వందేభారత్ రాకతో ఈ మార్గంలో ప్రయాణికులకు మంచి ప్రయోజనముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై వాల్తేరు డివిజన్ ఓ రైల్వే ఉన్నతాధికారిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదన్నారు. డివిజన్ పరిధిలో ఈ రైలు ప్రయాణానికి సంబంధించి లైన్ క్లియరెన్స్ సమాచారం ముందుగా ఇవ్వాల్సి ఉంటుందని, అలాంటిదేమి తమకు ఇంతవరకు చేరలేదని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 క్వింటాల ఇప్ప పువ్వు స్వాధీనం
[ 29-04-2024]
జిల్లాలో ఆబ్కారీ, పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
మగువ.. ప్రచారంలో తెగువ
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. -
పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
[ 29-04-2024]
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. -
మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్
[ 29-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్ మధుసూదన్ దాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్దాస్ అభివర్ణించారు. -
మండుటెండల్లో.. చల్లచల్లగా!
[ 29-04-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. -
మౌనమేలనోయి!
[ 29-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
[ 29-04-2024]
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. -
డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
[ 29-04-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. -
పొట్టంగిలో భారీ వర్షం
[ 29-04-2024]
కొరాపుట్ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. -
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో: రాహుల్
[ 29-04-2024]
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్ గాంధీ సాలెపూర్ సమావేశంలో ఆదివారం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా