ఏమైంది.. సీతంపేట ఊటీ
సీతంపేట ఐటీడీఏ కేంద్రానికి దగ్గరలో ఉన్న జగతిపల్లి పర్యాటకానికి అనుకూల ప్రాంతం. ఇక్కడున్న ఘాట్ రహదారి సమీపంలో ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఊటీ మాదిరి నిర్మాణాలు చేపట్టేందుకు ‘హిల్ రిసార్ట్సు’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.
కొత్త ప్రభుత్వంలో లేని కదలిక
మధ్యలోనే నిలిచిన నిర్మాణాలు
ఆశయం: సీతంపేట మన్యం ప్రాంతాన్ని పర్యాటక హబ్గా మార్చేందుకు అప్పట్లో తెదేపా ప్రభుత్వం ‘జగతిపల్లి హిల్ రిసార్ట్సు’ ప్రాజెక్టు చేపట్టింది. నిధులు కూడా ఇవ్వడంతో పనులు ఊపందుకున్నాయి.
ఆవిరి: ఎన్నికల కోడ్ అమలు.. అనంతరం కొత్త ప్రభుత్వం రాకతో అక్కడ ఎలాంటి కదలికలూ లేకపోవడంతో పనులు రద్దు చేశారో.. కొనసాగుతాయో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సీతంపేట, న్యూస్టుడే: సీతంపేట ఐటీడీఏ కేంద్రానికి దగ్గరలో ఉన్న జగతిపల్లి పర్యాటకానికి అనుకూల ప్రాంతం. ఇక్కడున్న ఘాట్ రహదారి సమీపంలో ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఊటీ మాదిరి నిర్మాణాలు చేపట్టేందుకు ‘హిల్ రిసార్ట్సు’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. కాటేజీలతో పాటు మినీ కాన్ఫెరెన్సు భవనం, మినీ థియేటర్, చిన్నపిల్లల ఆట స్థలాలు, రెస్టారెంట్లు, క్యాంపు ఫైర్ నిర్వహణకు సౌకర్యాలు, పెద్ద ఈతకొలను, యాంపీ థియేటర్, మరుగుదొడ్లు, పార్కింగ్, ఎంట్రన్స్ ఆర్చ్, వ్యూ పాయింట్ తదితర నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.27 కోట్లు కాగా అంతే మొత్తాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసింది.
సగం సగమే
ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో సాయితేజ ఇంజినీరింగ్ వర్క్సు వారికి పనులు అప్పగించారు. మొదటి విడతలో రూ.7 కోట్లతో టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. 2019 చివరిలో పనులు ప్రారంభం కాగా ఎర్త్వర్క్స్, పునాది, పిల్లర్ల స్థాయి వరకు పనులు జరిగాయి. అనంతరం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిన పనుల్లో నేటికీ కదలికలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా అటువైపు చూడలేదు. నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో గుత్తేదారు సగం పనులు చేసి వదిలేశారు.
మాస్టర్ ప్లాన్
రోప్వేకు ప్రతిపాదనలు
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏటా పునఃఅంచనాలు వేస్తున్నారు. ఈక్రమంలో నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. అడ్వాన్స్ కింద అప్పట్లో రూ.7 కోట్ల నిధులు మంజూరు కావడంతో కొన్ని పనులు జరిపించాం. బిల్లులు కాకపోవడం, ఇతరత్రా సమస్యలతో గుత్తేదారు మధ్యలోనే ఆపేశారు. రోప్వే ఏర్పాటుకు ఇటీవల అనుమతులు కోరుతూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. మంజూరయ్యేందుకు అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. - మదన్మోహన్, ఏఈ, పర్యాటక శాఖ
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. కొన్ని రోజుల క్రితం పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మన్యంలో పర్యటించిన సమయంలో ప్రాజెక్టు గురించి వివరించాం. ఈ మేరకు వారు పరిశీలించే అవకాశం ఉంది. మరోసారి విన్నవిస్తాం. - బి.నవ్య, పీవో, ఐటీడీఏ, సీతంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూచోడి సర్వే మాయ
[ 06-05-2024]
అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్ చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. -
కర్కశ పాలనలో రక్కసి రోడ్లు
[ 06-05-2024]
ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. -
పునరావాసంలో జగన్మోసం
[ 06-05-2024]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. -
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న
[ 06-05-2024]
ఆశా కార్యకర్తల్లో వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. -
పాలవలస కుటుంబానికి చుక్కెదురు!
[ 06-05-2024]
వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్లు పొందారు. -
ప్రైవేటు ఉద్యోగులకు ఎన్నికల విధులు
[ 06-05-2024]
ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. -
రాక్షస పాలన వారంలో ముగుస్తుంది
[ 06-05-2024]
రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. -
చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత
[ 06-05-2024]
చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, -
ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం
[ 06-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు తెలుసునని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారట్ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్ చట్టం
[ 06-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్మోహన్రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు