కాలువలకు మహర్ధశ
ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనుల్లో ప్రాధాన్యం మారుతోంది. ఈ ఏడాది వాటి కింద భవనాలను నిర్మిస్తున్నారు.
2023-24 ఉపాధి ప్రణాళికలో అభివృద్ధి
తాటిపూడి కాలువ
విజయనగరం అర్బన్, గంట్యాడ గ్రామీణం, న్యూస్టుడే: ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనుల్లో ప్రాధాన్యం మారుతోంది. ఈ ఏడాది వాటి కింద భవనాలను నిర్మిస్తున్నారు. 2023-24 ఏడాదిలో నీటి పారుదల కాలువల్ని బాగు చేయాలని నిర్ణయించారు. తుప్పల తొలగింపుతో పాటు పూడికతీత పనులు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆయా పనులను గుర్తించిన అధికారులు అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఆమోదంతో మండల, జిల్లా పరిషత్తులో తీర్మానం ఆధారంగా జనవరి నుంచి పనులు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో దీర్ఘకాలంగా మేజర్, మైనర్ రిజర్వాయర్ల కాలువలు అభివృద్ధికి నోచుకోలేదు. వీటిలో పూడిక పేరుకుపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంటోంది. దీంతో వాటి అభివృద్ధికి జిల్లాస్థాయిలో నిర్ణయించడంతో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 23 మండలాల్లో 269 కాలువలు బాగు చేయాలని నిర్ణయించారు.
వీటికి మంచిరోజులు
విజయనగరం జిల్లా: తాటిపూడి, తోటపల్లి, వెంగళరాయ, ఆండ్ర, పెదగెడ్డ, పెదంకలాం, పారాది, గజపతినగరం ఆనకట్ట.
మన్యం జిల్లా: వట్టిగెడ్డ, జంఝావతి, గుమ్మడి గెడ్డ, కొండలేవిడి, గుజ్జువాయి, లిక్కిడి, ఊసకొండ, వలస బల్లేరు, కైరాడ, జి.శివడ, తోటపల్లి, వరహాల గెడ్డ.
గ్రామసభల్లో..: వచ్చే ఏడాదిలో చేపట్టనున్న పనుల గుర్తింపునకు సంబంధించి ఇప్పటికే గ్రామసభలు పూర్తిచేశారు. రెండు జిల్లాల్లో 1226 గ్రామసభలు నిర్వహించి, 24,928 పనులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 3468, పార్వతీపురం మన్యంలో 21,460 పనుల్ని ఎంపిక చేశారు. 140 రకాల పనులకు ప్రాధాన్యమిచ్చారు. నీటిపారుదల కాలువలతో పాటు ఫీడర్ ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్లు, ఎంఐ ట్యాంకులు, ట్రెంచ్ కటింగ్, ఫారం పాండ్స్ (నీటి కుంటలు), చేపల చెరువులు, చెత్త సంపద కేంద్రాలు, పెర్క్యులేషన్ ట్యాంకులు, ఉద్యానాలు, సూక్ష్మనీటి సేద్యం తదితర పనులు చేపట్టనున్నట్లు రెండు జిల్లాల పీడీలు ఉమా పరమేశ్వరి, రామచంద్రరావు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
[ 28-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. -
అందలంపై నీవు.. అంధకారంలో మేము
[ 28-04-2024]
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. -
రూపాయి రుణమివ్వని జగన్
[ 28-04-2024]
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 28-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. -
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు
[ 28-04-2024]
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
వైకాపాను ఛీకొట్టి.. ఓటుకు జైకొట్టి
[ 28-04-2024]
ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది. -
జిల్లా ఓటర్లు 7,83,440
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. -
టోల్ తీస్తారు
[ 28-04-2024]
విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం
[ 28-04-2024]
విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. -
ఇది జగనన్న చీకటి రాజ్యం..!!
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. -
సర్కార్ తెచ్చిన నీటి కరవు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. -
పెద్దపల్లికి పెద్దగెడ్డ నీరు తెస్తా
[ 28-04-2024]
పెద్దపల్లిలో చెరువుకు వెళ్లే దారిలో వంతెన నిర్మిస్తామని, పెద్దగెడ్డ నీరు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడుగుతానని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!