బొబ్బిలి వీణలకు భలే గిరాకీ
చారిత్రక గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకు గిరాకీ పెరిగింది. విశాఖలో గత నెలలో జరిగిన గ్లోబల్ సమ్మిట్కు ఇక్కడి నుంచి బహుమతి వీణలు వెళ్లగా..
తరలి వెళ్లిన గిఫ్ట్వీణలు
బొబ్బిలి, న్యూస్టుడే: చారిత్రక గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకు గిరాకీ పెరిగింది. విశాఖలో గత నెలలో జరిగిన గ్లోబల్ సమ్మిట్కు ఇక్కడి నుంచి బహుమతి వీణలు వెళ్లగా.. నేటి నుంచి జరగనున్న జి-20 సదస్సుకు కూడా సుమారు 200 వీణలు బొబ్బిలి కేంద్రం నుంచి వెళ్లాయి. దీంతో వాటికి మరింత ప్రాచుర్యం దక్కింది. ఈ సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. వారికి నిర్వాహకులు ఆహ్వానం పలికి ఈ వీణలను బహూకరించనున్నారు. లేపాక్షి ఆధ్వర్యంలో కొనుగోలు చేసి తరలించారు. బొబ్బిలి వీణతో కచేరిని కూడా సదస్సులో ఏర్పాటు చేయనుండడంతో కళాకారుడు సర్వసిద్ధి లక్ష్మణరావు, కేంద్రం ఇన్ఛార్జి రామకృష్ణ వెళ్లారు. వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్లోనూ కచేరి నిర్వహించారు. నెల రోజుల వ్యవధిలో రెండు అంతర్జాతీయ సదస్సులకు ఈ జ్ఞాపికలు వెళ్లడం విశేషం. మరిన్ని ఆర్డర్లు వచ్చాయని, వీణలకు మరింత ఆదరణ పెరుగుతోందని, కళాకారులకు కూడా గౌరవం పెరుగుతోందని కేంద్రం ఇన్ఛార్జి రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్కాల్స్తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..