మీ ఓటు పదిలమేనా..!
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే.
లేకపోతే ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
కొత్తవలస, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. ఓటు వేసే రోజు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత లేదని తెలిసి కొందరు లబోదిబోమనడం చూస్తూనే ఉన్నాం. ఓటర్ల జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకుని లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, వివరాల సవరణకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఏడాది జనవరి 22న ఎన్నికల సంఘం 2024 ఓటర్ల జాబితాను ప్రచురించింది.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నందున 15వ తేదీ వరకు ఓటుహక్కు నమోదు, సవరణకు అవకాశం కల్పించారు. వెంటనే జాబితా తనిఖీ చేసుకుని, లేకుంటే నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు ఫారం-6 స్వీకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాల ప్రచురణ అయిపోయినందున, ఇప్పటి నుంచి ఏప్రిల్ 15 వరకూ వచ్చే కొత్త ఓటర్లను అనుబంధం (సప్లిమెంటరీ) జాబితాలో చేరుస్తామని వివరిస్తున్నారు.
ఉదాసీనత తగదు
జాబితాల పరిశీలనలో ఓటర్లు ఉదాసీనంగా వ్యవహరించకూడదు. తమ ఓటు ఉందా? ఉంటే తమ పోలింగ్ బూత్లోనే ఉందా? తమ కుటుంబ సభ్యులకు చెందినవన్నీ ఒకే చోట ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. తుది జాబితా విడుదల చేసిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాలు, ఆన్లైన్లో అందుబాటులో ఉంచినప్పటికీ తమ పేరు ఉన్నదీ లేనిదీ కూడా చూసుకోవడం లేదు. సాధారణంగా ఓటు ఎక్కడ ఉందో బీఎల్వోలు ఓటర్లకు వివరించాలి. నివాస ప్రాంతానికి సమీప కేంద్రంలోనికి మార్చేలా చూడాలి. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ఇలా చేయండి
కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతను పరిశీలించి అధికారులు ఓటేసే హక్కును కల్పిస్తారు. దీంతో పాటు చిరునామా మార్చుకోవడానికి అవకాశం ఉంది. దానికి ఫారం-8 అవసరం. గ్రామ/వార్డు సచివాలయం, తహసీల్దార్ కార్యాలయంలోని బూత్ స్థాయి అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ఓటరు హెల్ప్లైన్ యాప్, హెచ్టీటీపీ//సీఈవోఆంధ్రా.నిక్.ఇన్, హెచ్టీటీపీ//ఓటర్స్.ఈసీఐ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
జనవరిలో ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ నియోజకవర్గాల్లో 23,16,599 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో విజయనగరం జిల్లాలో 15,41,001 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,75,598 మంది ఉన్నట్లు చూపించారు. రెండు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికం. విజయనగరం జిల్లాలో 7,80,518 మంది కాగా, పురుషులు 7,60,400 మంది ఉన్నారు. మహిళల ఓట్లు 20,118 అధికంగా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు 3,86,746 మంది కాగా, పురుషులు 3,78,774 మంది ఉన్నారు. ఇక్కడా 7,972 మంది స్త్రీలు అధికంగా నమోదయ్యారు. రెండు జిల్లాల్లో కలిపి మూడో తరం ఓటర్లు 151 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
[ 28-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. -
అందలంపై నీవు.. అంధకారంలో మేము
[ 28-04-2024]
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. -
రూపాయి రుణమివ్వని జగన్
[ 28-04-2024]
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 28-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. -
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు
[ 28-04-2024]
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
వైకాపాను ఛీకొట్టి.. ఓటుకు జైకొట్టి
[ 28-04-2024]
ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది. -
జిల్లా ఓటర్లు 7,83,440
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. -
టోల్ తీస్తారు
[ 28-04-2024]
విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం
[ 28-04-2024]
విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. -
ఇది జగనన్న చీకటి రాజ్యం..!!
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. -
సర్కార్ తెచ్చిన నీటి కరవు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. -
పెద్దపల్లికి పెద్దగెడ్డ నీరు తెస్తా
[ 28-04-2024]
పెద్దపల్లిలో చెరువుకు వెళ్లే దారిలో వంతెన నిర్మిస్తామని, పెద్దగెడ్డ నీరు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడుగుతానని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..