మావయ్యా.. మాగోడు వినవేమయ్యా!
మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు.
మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్రాలకు భవనాలు నిర్మించేందుకు నిధులు క్చేటాయించారు. చాలా చోట్ల పనులు ప్రారంభించారు. ఇంతలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గుత్తేదారుల బిల్లుల గురించి పట్టించుకోకపోవడంతో వారు నిర్మాణాలు వదిలేశారు. దీంతో చాలా చోట్ల అద్దె కొంపలే దిక్కయ్యాయి.
- న్యూస్టుడే, బొబ్బిలి, గ్రామీణం, బాడంగి, రామభద్రపురం, గంట్యాడ, గ్రామీణం
విద్యుత్తు లేక ఉక్కపోత
బాడంగి, న్యూస్టుడే: బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాలకు సంబంధించి అంగన్వాడీ ప్రాజెక్టు బాడంగి మండల కేంద్రంలో ఉంది. దాదాపు 225 కేంద్రాలు ఉండగా.. 59 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఎరుకుపాకలు కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేదు. వేసవి నేపథ్యంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో వంట, పిల్లల చదువు ఒకే గదిలో కొనసాగించాల్సి దుస్థితి.
కూలేందుకు సిద్ధం
గœంట్యాడ, న్యూస్టుడే: లక్కిడాం, కొర్లాం చెరుకుకాట అంగన్వాడీ కేంద్రాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో మరుగుదొడ్లు, వంట గదులు ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఉన్న ఒక్క గదిలోనే వంట, ఆటలు, చదువు సాగుతున్నాయి. పెంకుల ఇళ్లు కావడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు.
సగంలో ఆగిపోయాయ్..
బొబ్బిలి గ్రామీణం, న్యూస్టుడే: కొన్నేళ్ల క్రితం పిరిడిలో మూడు అంగన్వాడీ భవనాలు మంజూరు చేశారు. ఒక్క దానికి మాత్రమే స్లాబ్ వరకు పనులు జరిగాయి. మిగిలిన రెండు నాలుగు అడుగుల ఎత్తు గోడలకే పరిమితం అయ్యాయి. కొత్తపెంటకు సుమారు ఏడేళ్ల క్రితం భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా చాలకపోవడంతో స్లాబ్ వేశారు. గచ్చులు, తలుపులు, విద్యుత్తు ఇతర పనులు వదిలేశారు. దీంతో పంచాయతీ భవనంలో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
అద్దె కొంపల్లోనే..
బొబ్బిలి పట్టణంలో 104 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఎరుకులవీధి కేంద్రం మినహా మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పిల్లలు 3,063 మంది, గర్భిణులు 379, బాలింతలు 335, తల్లులు 714 మంది ఉన్నారు. పట్టణంలోని రామన్నదొరవలస అంగన్వాడీ కేంద్రం అద్దె ఇంటిలో నిర్వహిస్తున్నారు. పుల్లేరువలస గ్రామ పిల్లలను ఇందులో విలీనం చేశారు. వారు అప్పుడప్పుడు మాత్రమే కేంద్రానికి వస్తున్నారు. మంగళవారం కేంద్రంలో ఏడుగురు మాత్రమే భోజనాలు చేయడం కనిపించింది. రోజూ 15 మంది వస్తారని, ఈ రోజే తగ్గారని కార్యకర్త పద్మ తెలిపారు.
శిథిలమైన రేకుల షెడ్డులో..
రామభద్రపురô, న్యూస్టుడే: రామభద్రపురం శ్రీరామ్నగర్ కాలనీలో అంగన్వాడీ-1 కేంద్రం శిథిలమైన రేకుల షెడ్డులో గత 10 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. సొంత భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోవడంతో లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు. రేకుల కింద వేడితో చిన్నారులు ఉండేందుకు అలమటిస్తున్నారు.
వంట.. చదువు అక్కడే
గœంట్యాడ గ్రామీణం, న్యూస్టుడే: సిరిపురం అంగన్వాడీ కేంద్రానికి ఒక్క గది మాత్రమే ఉంది. అక్కడే వంటలు, చిన్నారుల ఆటలు, సామగ్రి నిల్వ చేస్తున్నారు. ఈ కేంద్రం విద్యుత్తు బిల్లును గత కొన్ని నెలలుగా పంచాయతీ కట్టకపోవడంతే కనెక్షన్ తీసేశారు. దీంతో పిల్లలు ఉక్కపోతలోనే ఉంటున్నారు. అంతేకాదు పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. లోపలి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. అధికారుల దృష్టిలో ఉంచామని, త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయని ఐసీడీఎస్ పీవో ఉమాభారతి ‘న్యూస్టుడే’తో అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూచోడి సర్వే మాయ
[ 06-05-2024]
అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్ చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. -
కర్కశ పాలనలో రక్కసి రోడ్లు
[ 06-05-2024]
ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. -
పునరావాసంలో జగన్మోసం
[ 06-05-2024]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. -
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న
[ 06-05-2024]
ఆశా కార్యకర్తల్లో వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. -
పాలవలస కుటుంబానికి చుక్కెదురు!
[ 06-05-2024]
వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్లు పొందారు. -
ప్రైవేటు ఉద్యోగులకు ఎన్నికల విధులు
[ 06-05-2024]
ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. -
రాక్షస పాలన వారంలో ముగుస్తుంది
[ 06-05-2024]
రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. -
చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత
[ 06-05-2024]
చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, -
ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం
[ 06-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు తెలుసునని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారట్ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్ చట్టం
[ 06-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్మోహన్రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM