చిత్తూరుపై పట్టు బిగించిన తెదేపా
చిత్తూరు జిల్లాలోని నీవా నదీతీరంలో రాజకీయ సంగ్రామం రసవత్తరంగా మారింది.
లోక్సభతో పాటు పలు అసెంబ్లీ స్థానాల్లో పెరిగిన బలం
అధికార పార్టీ అక్రమాలు..
దౌర్జన్యాలపై ప్రజల్లో వ్యతిరేకత
ఇసుక దందా.. భూ ఆక్రమణల్లో
వైకాపా ప్రజాప్రతినిధుల ప్రమేయం
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
చిత్తూరు నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
చిత్తూరు జిల్లాలోని నీవా నదీతీరంలో రాజకీయ సంగ్రామం రసవత్తరంగా మారింది. మొదటి నుంచి కాంగ్రెస్, వైకాపాలకు మద్దతుగా నిలుస్తున్న చిత్తూరు లోక్సభ (ఎస్సీ) రిజర్వుడు నియోజకవర్గ ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా? వైకాపా చేతికి వెళ్లిన స్థానాన్ని తెదేపా తిరిగి దక్కించుకోనుందా అంటే అవుననే అంటున్నారు ఇక్కడి ప్రజలు. గడచిన ఐదేళ్లలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతల అరాచకాలు.. ఇసుక దందా.. భూ ఆక్రమణలు.. ప్రతిపక్ష నాయకులను కేసులతో వేధించడం, వారిపై దాడుల్లాంటి ఘటనలు ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకున్నాయి. తమ నిరసనను ఓట్ల రూపంలో తెలపాలని నిర్ణయానికి వచ్చారు. లోక్సభ పరిధిలోని నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి పర్యటించినప్పుడు ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు స్పష్టంగా కనిపించింది. మనసులో మాట చెప్పడానికే గతంలో భయపడే ఓటరు.. ఇప్పుడు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వ పాలనలో తమకు ఎదురైన ఇబ్బందులను కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు. కుప్పం, నగరి, పలమనేరు నియోజకవర్గాల్లో తెదేపాకు పూర్తి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. చంద్రగిరి, చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరులో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.
భిన్న తీర్పులే ఇక్కడ ప్రత్యేకం
చిత్తూరు లోక్సభ స్థానానికి బలమైన అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావును తెదేపా ఎన్నికల బరిలో నిలిపింది. వైకాపా తరఫున సిటింగ్ ఎంపీ రెడ్డెప్ప మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్సీలకు రిజర్వు చేసిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో.. 2009, 2014లో తెదేపా గెలిచింది. జిల్లాలోని ప్రత్యేక పరిస్థితులు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయావకాశాల్లో కీలకం కానున్నాయి. మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో వేరేపార్టీ గెలిచినా, లోక్సభ నుంచి తెదేపా గెలుపొందడం ఇక్కడ ప్రత్యేకత. చంద్రబాబుకు కుప్పంలో వచ్చే మెజారిటీ ఎంపీ అభ్యర్థి విజయావకాశాలను మెరుగుపరిచే వాతావరణం ఉంది. 2009 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నగరి, పలమనేరు, కుప్పం.. 2014లో చిత్తూరు, కుప్పం అసెంబ్లీ స్థానాలనే తెదేపా గెలుచుకుంది. కానీ ఆ రెండు ఎన్నికల్లో ఎంపీ స్థానం తెదేపా ఖాతాలో పడింది.
కుప్పంలో మెజారిటీపైనే దృష్టి
తెదేపా అభ్యర్థి చంద్రబాబు గెలుపు నల్లేరుపై నడక కానుంది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా పార్టీశ్రేణులు పనిచేస్తున్నాయి. కుప్పం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వరుసగా ఏడుసార్లు చంద్రబాబునే విజయం వరించింది. వైకాపా తరఫున ఎమ్మెల్సీ భరత్ను పార్టీ బరిలో నిలిపింది. ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకతే చంద్రబాబుకు భారీ మెజారిటీ తెచ్చిపెడుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. క్వారీల నుంచి అనధికారిక వసూళ్లు చేసినట్లు, ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులతో వేధించినట్లు భరత్పై ఉన్న ఆరోపణలు ఎన్నికల్లో ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలకు నిధులు విడుదలైనా.. పనులు జరగకుండా మంత్రి పెద్దిరెడ్డి అడ్డుపడటం వైకాపాకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.
చెవిరెడ్డి దందాలతో.. ‘సన్’కు స్ట్రోక్ తప్పదా?
చంద్రగిరి నుంచి తెదేపా తరఫున పులివర్తి వెంకట మణిప్రసాద్ (నాని).. వైకాపా తరఫున సిటింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్రెడ్డి మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీచేయడంతో ఏర్పడిన ఓట్ల చీలికతో చెవిరెడ్డి మంచి మెజారిటీ సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగారు. ఆయన అక్కడే దృష్టిపెట్టడంతో.. నియోజకవర్గంలో వ్యవహారాలను ఆయన కుమారుడు చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. తిరుచానూరు మాజీ సర్పంచ్ సీఆర్ రాజన్, డాలర్స్ దివాకర్రెడ్డి, బడి సుధాయాదవ్, పాకాల జడ్పీటీసీ సభ్యురాలు పద్మజారెడ్డి భర్త బాబురెడ్డి (చెవిరెడ్డి ముఖ్య అనుచరుడు), మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మునిపల్లి సుధీర్రెడ్డి వంటి బలమైన నేతలు తెదేపాలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. చెవిరెడ్డి అనుచరుల దందాలు.. దౌర్జన్యాలు.. సెటిల్మెంట్లు వైకాపాకు ప్రతికూలంగా మారతాయని చెబుతున్నారు. మఠం భూములను దౌర్జన్యంగా ఆక్రమించినట్లు చెవిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి నియోజకవర్గంలో భూ మాఫియా, మైనింగ్, ఇసుక అక్రమ రవాణా వ్యవహారాలను ప్రోత్సహించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఎన్నికలు ఏకపక్షంగా జరిగే వాతావరణం లేదు. చెవిరెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకతతో ఈసారి ఎన్నికల్లో మోహిత్రెడ్డి గెలుపు అంత సులువు కాదన్నది ప్రజల అభిప్రాయం. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడటం.. వైకాపా నుంచి బలమైన నాయకులు పార్టీలో చేరడం ప్రస్తుత ఎన్నికల్లో తెదేపాకు కలిసొచ్చే అంశాలు.
నగరిలో రోజాకు కష్టమే
ఇక్కడ తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్కు సానుకూలత పెరిగింది. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో వైకాపా తరఫున రోజా స్వల్ప ఆధిక్యతతో గెలిచి, మూడోసారి బరిలో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆమె దృష్టిపెట్టకపోగా.. ఆమె సోదరులు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాద్రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. వడమాలపేట దగ్గర ఏపీఐఐసీ కోసం భూములను అధికధరకు సేకరించడం ద్వారా రూ.10 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలతో పాటు.. అక్రమ క్వారీల నిర్వహణకు సహకరించినట్లు, విలువైన భూములను దౌర్జన్యంగా తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల నుంచి.. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల వరకు అన్నింటి భర్తీలోనూ వసూళ్లకు పాల్పడటాన్ని ప్రజలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రోజాను వ్యతిరేకిస్తూ నగరి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు పలువురు సర్పంచులు, ఐదు మండలాల వైకాపా ఇన్ఛార్జిలు రాజీనామా చేశారు. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్ చక్రపాణిరెడ్డి సైతం గుడ్బై చెప్పేశారు.
జీడీ నెల్లూరులో విజయంపై ఇరువురిలోనూ ధీమా
జిల్లాలోని రెండో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం గంగాధర నెల్లూరులో మరోసారి వైకాపా, తెదేపా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇక్కడినుంచి ఎవరు గెలిచినా స్పల్ప ఆధిక్యతతో గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో వైకాపా తరఫున గెలుపొందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ఆయన కుమార్తె కృపాలక్ష్మి, తెదేపా తరఫున వీఎం థామస్ తలపడుతున్నారు. వైకాపాకు బలమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన జీడీ నెల్లూరులో.. మారిన రాజకీయ పరిణామాలతో తెదేపా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. నియోజకవర్గానికి ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యే నారాయణస్వామి విఫలం కావడం.. ప్రతిపక్ష, సొంత పార్టీ వారిని అక్రమ కేసులతో వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రభావం ఆయన కుమార్తె విజయావకాశాలపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
చిత్తూరు బరిలో.. ఇద్దరూ కొత్తవాళ్లే
చిత్తూరు నియోజకవర్గంలో తెదేపా తరఫున గురజాల జగన్మోహన్, వైకాపా తరఫున విజయానందరెడ్డి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరూ మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగడం.. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ ఉత్కంఠభరితంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, మనోహర్ తెదేపాలో చేరడం అదనపు బలాన్ని తెచ్చింది. సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థి) సహకారం తెదేపా అభ్యర్థికి కలిసిరానుంది. ఎర్రచందనం అక్రమ రవాణా.. కల్తీ మద్యం కేసుల్లో వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి నిందితుడు. తనపై 12 కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. అలాంటి అభ్యర్థికి వైకాపా టికెట్ కట్టబెట్టడంపై ఓటర్లలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇళ్ల పట్టాల పంపిణీలో అనుచరుల వసూళ్లు.. లాటరీ టికెట్ల పేరుతో మాయాజాలం వంటి ఆరోపణలున్నాయి. వైకాపా అభ్యర్థికి ఇవన్నీ ప్రతికూల అంశాలు.
పలమనేరుపై మళ్లీ తెదేపా పట్టు
తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పట్ల నియోజకవర్గ ప్రజల్లో మొగ్గు కనిపిస్తోంది. వైకాపా సిటింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముస్లిం, ఎస్సీ సామాజికవర్గాల్లో తెదేపాపై సానుకూలత కనిపిస్తోంది. ఎమ్మెల్యే వెంకటేగౌడ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం ఓటర్లలో ఉంది. పలు మండలాల్లో బలమైన ఓటుబ్యాంకు ఉన్న స్థానిక నేతలను దూరం చేసుకోవడం ఎన్నికల్లో ఆయనకు ప్రతికూల ఫలితాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఇసుక దందాలో ప్రమేయం.. కర్ణాటకలోని క్వారీని బలవంతంగా లాక్కున్న ఆరోపణలతో న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడం వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి సోదరుడు, పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కరరెడ్డి తెదేపాలో చేరడం ఆ పార్టీకి కలిసొస్తుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.
పూతలపట్టులో హోరాహోరీ
2009లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో తెదేపా రెండుసార్లు స్వల్ప తేడాతో ఓటమి చెందింది. ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మురళీమోహన్, వైకాపా అభ్యర్థి సునీల్కుమార్ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఆయన వైకాపా ఓట్లకే గండికొట్టే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చీల్చే ఓట్లు తమకు విజయావకాశాలను తెచ్చి పెడతాయని తెదేపా భావిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు