logo

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి

తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు.

Published : 10 May 2024 17:09 IST

బలిజిపేట: తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. పలగర గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామంలోని మహిళలు కుంకుమ తిలకాలు దిద్ది హారతులిచ్చారు. కూటమి సారధ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టనున్న సూపర్‌సిక్స్‌ పథకాల వల్ల మహిళలకు, నిరుపేదలకు ఎంతో ప్రయోజనం కలగనుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు, నాయకులు శంబాన మనోహరరావు, శంబాన గౌరునాయుడు, ఎం.అప్పారావు, గంట గౌరీశంకరరావు, జనసేన రాష్ట్ర ప్రచారకార్యదర్శి పాలూరు బాబు, కుమారస్వామి, పోలినాయుడు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు