తిరుగు ప్రయాణం.. పెనుభారం
ఒంగోలు నుంచి నిత్యం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు వంటి ప్రాంతాలకు పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి. రాష్ట్రంలో 970 ట్రావెల్స్ బస్సులకు అనుమతులు ఉన్నాయి. వీటిలో సుమారు 250కి పైగా జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తాయని అంచనా.
ఇష్టారాజ్యంగా ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు
ఆర్టీసీ సైతం వడ్డింపు
ఒంగోలులో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కుతున్న కుటుంబం
సంక్రాంతి పండగ ఆనందం ట్రావెల్స్ నిర్వాహకుల తీరుతో ఆవిరైపోతుంది. ఉత్సాహంగా తిరుగుప్రయాణమైన వారికి బస్సుల టి·కెట్ల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఈ పర్వదినానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు జిల్లాలోని తమ స్వస్థలాలకు విచ్చేశారు. అనేకమంది ఆదివారం రాత్రి నుంచే తిరుగు ప్రయాణమయ్యారు.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు నుంచి నిత్యం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు వంటి ప్రాంతాలకు పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి. రాష్ట్రంలో 970 ట్రావెల్స్ బస్సులకు అనుమతులు ఉన్నాయి. వీటిలో సుమారు 250కి పైగా జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తాయని అంచనా. వీటితో పాటు ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు, కనిగిరి ప్రాంతాల నుంచి నిత్యం 60-70 బస్సులు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి.
బాబోయ్ ఆ ధరలు
ట్రావెల్స్ పేరిట ప్రయాణిస్తున్న బస్సుల్లో ఎక్కువగా కాంట్రాక్టు కేరియర్లుగా అనుమతి పొందినవే. ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు ప్రయాణికులను తరలించేలా అనుమతులు పొందుతారు. ఎక్కువమంది నిబంధనలు ఉల్లంఘించి వాటిని స్టేజి కేరియర్లుగా తిప్పుతున్నారు. ప్రత్యేక కౌంటర్లు తెరిచి టికెట్లు సైతం విక్రయిస్తున్నారు. సంక్రాంతి, దసరా వంటి పండగల సమయాల్లో ధరలు దోపిడీనే. ఉదాహరణకు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లే ఏసీ బస్సులో సాధారణ రోజుల్లో సీటుకు టికెట్ ధర రూ.600-700 ఉంది. బెర్తు రూ.900, రూ.వెయ్యి ఉంటుంది. ఆర్టీసీలో ఈ ధర రూ.600-770. ఈ సీజన్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రావెల్స్ బస్సులు సీటుకు రూ.1000, బెర్తు రూ.1,400 నుంచి రూ.1,800 దాకా వసూలు చేస్తున్నాయి. బెంగళూరు, విశాఖపట్నం వంటి దూరప్రాంతాలకు ఈ వ్యత్యాసం మరింతగా ఉంటోంది. ఆర్టీసీ సైతం సాధారణ రోజుల్లో కంటే 50 శాతం అధికంగా ధరలు వసూలు చేస్తోంది. కొందరు ప్రయాణికులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సుల ద్వారా సాధారణ ఛార్జీలతో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.
జాగ్రత్తలు ఎక్కడ?
ప్రస్తుతం కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇవేవీ కొన్ని యాజమాన్యాలకు పట్టడం లేదు. బస్సులను శానిటైజ్ చేస్తున్నారా లేదా అనేది పరిశీలించేవారు సైతం లేరు. బస్సు సీటింగ్ సామర్థ్యంలో సగం వరకే అనుమతించాలనే నిబంధనలు అమలుకాలేదు. చివరకు క్యాబిన్లలోనూ ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా కనిపిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం సోమవారం సాయంత్రం, రాత్రి అధికసంఖ్యలో ప్రయాణికులు ఇక్కడకు చేరుకున్నారు. -ఈనాడు, ఒంగోలు
410 బస్సుల్లో తనిఖీలు
జిల్లా రవాణా శాఖ అధికారులు ఈ నెల ఏడో తేదీ నుంచి జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన వివరాల ప్రకారం 410 బస్సులను పరిశీలించారు. వివిధ ఉల్లంఘనల కింద 52 బస్సులపై కేసులు నమోదు చేశారు. మార్కాపురంలో ఓ ట్రావెల్స్ బస్సును ఇటీవల తనిఖీ చేసి సీజ్ చేశారు. ఇది ఈశాన్యరాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన బస్సు. ఎటువంటి పత్రాలు లేకుండానే తిరుగుతుంది. దీంతో ఈ ఒక్కదానికే రూ.1.32 లక్షల జరిమానా విధించారు. మిగిలిన 51 బస్సులకు అధికారులు విధించింది రూ.81వేలు. అంటే ఒక్కొక్క బస్సుకు సగటున పడింది ఎంతో తెలుసా? కేవలం రూ.1,588. మరోవైపు తమ జేబులు గుల్లవుతున్నాయని, టికెట్ల దందాకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్ హిట్.. తెదేపా శ్రేణుల్లో జోష్
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పొదిలి, గిద్దలూరులో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. -
జనం చూస్తే నాకేంటి!
[ 04-05-2024]
పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు. -
జగన్కు జిల్లా ‘రివర్స్’ షాక్
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి జిల్లాలో జనం ‘రివర్స్’ షాక్లిస్తున్నారు. ఇటీవల టంగుటూరులో మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోరుతూ జగన్ ప్రచారం చేశారు. -
ఏలికా.. మా ఉసురు తగలదా!
[ 04-05-2024]
ఎన్నికల వేళ లబ్ధికి జగన్ తెర లేపిన వికృత రాజకీయ క్రీడకు పండుటాకులు విలవిల్లాడుతున్నారు. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అవ్వాతాతలను బ్యాంక్లకు రప్పించారు. -
నిత్యం పరేషాన్
[ 04-05-2024]
ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు.. సమయ పాలన ఉండదు. -
సేవకుడిని కాదని స్మగ్లర్కు వైకాపా సీటు
[ 04-05-2024]
సైకో జగన్ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదని తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి సీటిచ్చారు. తాతల నాటి ఆస్తులను కొట్టేసేందుకు భూరక్షణ చట్టం తెచ్చారు. -
వైకాపాను ఓడించకపోతే.. యువతకు ఉపాధి కష్టమే
[ 04-05-2024]
వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. -
తపాలా ఓట్లకు ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 04-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఫ్లోరైడ్ ఊసెత్తక.. నిమ్జ్ మాటెత్తక..
[ 04-05-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. కనిగిరి ప్రాంత సమస్యలపై గట్టి హామీలిస్తారని..తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. -
తెదేపాలోకి ఇద్దరు కార్పొరేటర్లు
[ 04-05-2024]
ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలోకి చేరగా, శుక్రవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. -
పశ్చిమ ప్రకాశానికి వరాల జల్లు
[ 04-05-2024]
మండు వేసవిలో చంద్రన్న కురిపించిన వరాల జల్లుతో పొదిలివాసులు పులకరించారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన ఒక్కో హామీకి చప్పట్లు చరిచి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
నీళ్లో.. జగనన్నా!
[ 04-05-2024]
గిద్దలూరు నగరపంచాయతీవాసులు గత పదిహేను రోజులుగా తాగునీటికి అల్లాడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఉన్న డీప్బోర్లలో రోజుకో ప్రాంతంలో నీరు అడుగంటడంతో సమస్య తీవ్రతరమవుతోంది. -
కారు ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 04-05-2024]
కారు ఢీకొని ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచర్లవారిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM