ఐఏఎస్ల నుంచి అటెండర్ల వరకు...
మూడో విడత కరోనా మహమ్మారి ఉద్ధృతి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, ఉద్యోగులు వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితులతో పలువురు ఆందోళన చెందుతున్నారు.
కరోనా బారిన ఉద్యోగులు
ఖాళీ అవుతున్న కార్యాలయాలు
కందుకూరు ఉప కలెక్టర్ కార్యాలయం
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే : మూడో విడత కరోనా మహమ్మారి ఉద్ధృతి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, ఉద్యోగులు వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితులతో పలువురు ఆందోళన చెందుతున్నారు.
పరిపాలనపై ప్రభావం...: కందుకూరు ఉప కలెక్టర్ అపరాజిత సింగ్తో పాటు, అదే కార్యాలయానికి చెందిన 12 మంది ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దీంతో మిగిలిన వారిలోనూ భయం నెలకొంది. ఈ పరిణామం కందుకూరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది. ఎక్కువ మందికి ఒకేసారి కరోనా పాజిటివ్గా తేలడంతో.. గత రెండు రోజులుగా ఏదో ఒక పని మీద కార్యాలయానికి వెళ్లినవారు భయపడుతున్నారు.
టంగుటూరు, చీమకుర్తి, మార్టూరు, నాగులుప్పలపాడు, కారంచేడు మండలాల తహసీల్దార్లకూ పాజిటివ్గా తేలడంతో హోం ఐసోలేషన్ నిమిత్తం సెలవుపై వెళ్లారు. టంగుటూరు తహసీల్దార్ చిరంజీవికి కరోనాతో బాధపడుతుండగా.. అక్కడ అదనపు బాధ్యతలు అప్పగించేందుకు ఎవరూ లేరు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండటం ఇందుకు కారణం. దీంతో ఆయన అత్యవసర విభాగాలకు చెందిన దస్త్రాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. సంయుక్త కలెక్టర్(గృహ నిర్మాణం) కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో నలుగురు ఉద్యోగులతో పాటు, పర్చూరు, అద్దంకి డీఈలూ వైరస్ బారిన పడ్డారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో బి.జాలిరెడ్డితో పాటు, ఎ-విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరెడ్డి, అటెండర్ సన్నీ, మరో టైపిస్ట్కు కూడా కరోనా సోకింది. సీఈవో సెలవులో ఉండటంతో ఏవో వెంకటేశ్వరరావు అత్యవసర దస్త్రాలను నడుపుతున్నారు. యద్దనపూడి, ఇంకొల్లు ఎంపీడీవోలు శ్రీనివాసరావు, కిరణ్కుమార్కు పాజిటివ్ రావడంతో జడ్పీకి అధికారిక సమాచారం అందించారు.
ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచే...: జిల్లాలో 56 మండలాలున్నాయి. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు స్థానికుల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో నడుస్తున్న కార్యాలయాలతో పాటు, ఇతర సబ్ డివిజన్ కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఇప్పటికే కరోనా వైరస్ సోకింది. ఈ సమాచారం తెలుసుకున్న సదరు ఉద్యోగులు గత వారం రోజులుగా కార్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. ఆ తర్వాత రోజూ ఏదో ఒక కార్యాలయంలో మిగతా ఉద్యోగుల్లోనూ కేసులు వెలుగు చూస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా కొన్ని కార్యాలయాల్లో ఇతరులను లోపలికి రానీయడం లేదు. ప్రవేశద్వారం వద్దనే అర్జీలు స్వీకరిస్తున్నారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు.
సేవలకు అంతరాయం...
పాజిటివ్ కేసులు నమోదు కావడం.. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందికీ కాంటాక్ట్ కేసులు వెలుగు చూస్తుండటం.. ఉద్యోగులు హోం క్వారంటైన్లో ఉండటంతో పౌరసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అవసరమైన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ నుంచి పొందాల్సి ఉంటుంది. రబీ సీజన్ దృష్ట్యా బ్యాంకులో రుణం లేదా ఇతర అవసరాల నిమిత్తం రెవెన్యూ శాఖ నుంచి 1బీ, అడంగల్ కాపీలు అందజేయాల్సి ఉంటుంది. వీటి కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కరోనా కేసుల కారణంగా ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడంతో సకాలంలో అందటం లేదు. మరికొందరు ఇప్పటికే మ్యుటేషన్, సర్వేలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి వాటి గడువు ముగిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.
కొత్త పాజిటివ్ కేసులు 1399...
ఒంగోలు నగరం, న్యూస్టుడే: జిల్లాలో ఆదివారం 1399 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య 2215 మందికి పరీక్షలు చేయగా 63.2 పాజిటివిటీ రేటు నమోదైంది. అత్యధికంగా ఒంగోలులో 586, చీరాల 92, చీమకుర్తి 79, కొత్తపట్నం 69 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వ్యాక్సినేషన్లో భాగంగా 169 కేంద్రాల ద్వారా 18 ఏళ్లు నిండిన వారు 5999, బూస్టర్ డోస్గా 34,519 మంది టీకా పొందారు.
ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అర్జీల స్వీకరణకు
ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్