ప్రకాశిస్తున్నసంక్షేమం
గణతంత్ర వేడుకలను జిల్లా కేంద్రం ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికా గార్గ్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకంగా నవరత్నాల అమలు
కొవిడ్ మహమ్మారి కట్టడికి పటిష్ఠ చర్యలు
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్
జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్.. చిత్రంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు
రెడ్డి, ఎస్పీ మలికా గార్గ్, జేసీలు వెంకటమురళి, ఒంగోలు మేయర్ సుజాత, ఓఎస్డీ చౌడేశ్వరి తదితరులు
గణతంత్ర వేడుకలను జిల్లా కేంద్రం ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికా గార్గ్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతో జిల్లాలో సంక్షేమం ప్రగతి పథాన పరుగులు తీస్తోందని కలెక్టర్ ఉద్ఘాటించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే... ఈనాడు డిజిటల్, ఒంగోలు; ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే
విస్తృత సేవలు.. ఇళ్ల స్థలాలు...: జిల్లాలో 1058 గ్రామ, వార్డు సచివాలయాలు, 10,352 మంది ఉద్యోగులు, 17,965 మంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు విస్తృత సేవలందిస్తున్నాం. ఇప్పటి వరకు 20,07,462 వినతులందగా.. 99.79 శాతం పరిష్కరించాం. స్పందన ద్వారా వచ్చిన 1,89,976 అర్జీల్లో 98.92 శాతం పరిష్కరించాం. 1,34,174 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 3,017 ఎకరాలు సేకరించి 1,312 లేఅవుట్లలో 88,135 మందికి పట్టాలు అందజేశాం. వైఎస్సార్ రైతు భరోసా కింద 2020-21లో 4,00,474 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాం. ్ర వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ , కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పింఛను కానుక, బీమా, జగనన్నతోడు, అలానే అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలు చేస్తున్నాం.్ర వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 13,332 మందికి రూ.13.33 కోట్లు ఖాతాల్లో జమ చేశాం.
ఉపాధి హామీ పథకం కింద 6.42 లక్షల కుటుంబాలకు 2.01 కోట్ల పని దినాలు కల్పించాం.
ఆర్బీకేలకు సొంత భవనాలు...: నాడు- నేడు కింద మొదటి విడతలో 1388 పాఠశాలల్లో వసతులు కల్పించాం. రెండో విడతలో 1,028 బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. ్ర 323 సచివాలయాలు, 229 ఆర్బీకేలు, 105 ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తిచేశాం. 2.8 లక్షల వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు 648 ఫీడర్ల ద్వారా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.
మహమ్మారికి ముకుతాడు...: కొవిడ్ కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకు 25.94 వేల కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,48,682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మరణాల రేటు కేవలం 0.81 శాతంగా ఉంది. వ΄డో దశ కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క కొవిడ్ కేర్ కేంద్రం, 3,524 పడకలతో 49 కొవిడ్ కేర్ ఆస్పత్రులలో సేవలు అందించడానికి ఏర్పాట్లు చేశాం. అర్హులైన 29,33,966 మందికి వంద శాతం మొదటి డోస్ కొవిడ్ టీకా పూర్తిచేశాం. రెండో డోస్ 25,65,314 మందికి, ప్రికాషనరీ డోస్ 82.27 శాతంతో 44,204 మందికి అందించాం.
వేగంగా వెలిగొండ, నౌకాశ్రయం...: వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయి. స్టేజ్ 1 పనులను ఈ ఏడాది ఆగస్టుకు పూర్తిచేసి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుల చేస్తాం. స్టేజ్ 2 పనులను 2023 ఫిబ్రవరికి పూర్తిచేయడానికి చర్యలు చేపడుతున్నాం. గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు గ్రామాల వద్ద రామాయపట్నం పోర్టు, పారిశ్రామిక హబ్కు 4,620 ఎకరాల భూములు సేకరిస్తున్నాం.
చెత్త తరలించే రిక్షాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులు
ఆకట్టుకున్న 7 శకటాలు...
గణతంత్ర వేడుకల్లో భాగంగా ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు, జిల్లా ప్రగతిని చాటుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో మొత్తం ఏడు శకటాలను మాత్రమే ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్యశాఖ; విద్యాశాఖ, ఎస్ఎస్ఏ; డీఆర్డీఏ, గృహ నిర్మాణ, డ్వామా, వైద్య ఆరోగ్య శాఖ, 108, 104; పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శకటాలతో పాటు; పౌర సరఫరాల శాఖ ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ తీరుపై ఏర్పాటు చేసిన వాహన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రశంసనీయులు 115 మంది...
గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఉద్యోగ రీత్యా ప్రతిభ చూపిన 115 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఉద్యోగులు వీటిని అందుకున్నారు.
వేడుకల్లో కవాతు చేస్తున్న పోలీసు దళం
పరేడ్ మైదానంలో పాఠశాల విద్యాశాఖ శకటం ప్రదర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM