హోదా పెంచారు.. భర్తీ మరిచారు
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల స్థాయి పెంచారు తప్ప తదనుగుణంగా వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. కీలకమైన వైద్యసేవల కోసం అటు ఒంగోలు లేదా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. వైద్యవిధాన పరిషత్
వైద్యనిపుణులు లేని సీహెచ్సీలు
సాధారణ సేవలతో సరి
పునాదులకే పరిమితమైన గిద్దలూరు ఆసుపత్రి భవన నిర్మాణం
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల స్థాయి పెంచారు తప్ప తదనుగుణంగా వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. కీలకమైన వైద్యసేవల కోసం అటు ఒంగోలు లేదా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ దుస్థితి ఎక్కువగా ఉంది. - న్యూస్టుడే, ఒంగోలు నగరం
వైద్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీచేయడంలో జరుగుతున్న జాప్యంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ వేలకు వేలు బిల్లులు చెల్లించలేక అల్లాడుతున్నారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని మార్కాపురం జిల్లా ఆసుపత్రి, ఇతర ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో నిపుణులను(స్పెషలిస్టులు) నియమించి మెరుగైన వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. హోదాలు పెంచి వసతులు కల్పించినా కీలకమైన వైద్యులు లేని పరిస్థితి. ప్రస్తుతం 80 శాతం ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల పల్లె నిద్రకు వెళ్లిన సమయంలో జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ కంభం ఆసుపత్రిని పరిశీలించారు. సేవలు సక్రమంగా అందడంలేదని.. ప్రధానంగా గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, మత్తు వైద్యుల కొరత ఉందని ఆయన దృష్టికి వచ్చింది.
సిజేరియన్లు కష్టమే
జిల్లాలో వైద్యవిధాన పరిషత్ కింద 12 ఆసుపత్రులున్నాయి. చీమకుర్తి, ఒంగోలు మాతా శిశువైద్యశాల మినహా అన్ని చోట్ల గైనకాలజిస్టుల కొరత ఉంది. ఇటీవల యర్రగొండపాలెం ఆసుపత్రికి పురిటినొప్పులతో రాత్రిపూట వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేయాల్సి వచ్చింది. తొలి ప్రసవం కావడం, మత్తు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మార్కాపురం వెళ్లాలని వైద్యులు సూచించారు. వ్యయ ప్రయాసలకోర్చి అక్కడకు వెళ్లాల్సి వచ్చింది.
* గిద్దలూరు ఆసుపత్రిలో గతంలో 50 పడకలు ఉండగా రెండేళ్ల క్రితం 100 పడకలకు పెంచారు. పాత భవనం స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. బిల్లులు సరిగా రాకపోవడంతో నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఇంతవరకు పునాదులు దాటలేదు. పేరుకు వంద పడకలు ఉన్నా ప్రస్తుతం పాత భవనంలో 15 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. సిజేరియన్ చేసిన మహిళలకు సైతం సమస్య నెలకొంది. వసతి లేక ఇతర శస్త్రచికిత్సలు చేయడంలేదు. ఫిజియోథెరపీ విభాగం ఉన్నా నిరుపయోగమే.
* కనిగిరి ఆసుపత్రిని 30 నుంచి 50 పడకల స్థాయికి పెంచారు. అక్కడ 11 మందికి గాను అయిదుగురు వైద్యులే ఉన్నారు. పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు.
మాతా శిశువైద్యశాలలో నిరీక్షణ
జిల్లా కేంద్రంలోనూ అరకొరగానే...
ఒంగోలు మాతా శిశువైద్యశాలలో డిప్యూటేషన్పై ఇతర ఆసుపత్రుల నుంచి వైద్యులను నియమించారు. వారు ఎంతకాలం కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియన్ పోస్టులు ప్రధానంగా అవసరం. ఈఎన్టీ, డెంటల్, ఆప్తమాలజీ, ఫిజియోథెరపి వైద్యుల కొరత ఉంది. కిందిస్థాయి సిబ్బందిని ఇటీవల ఒప్పంద పద్ధతిలో తీసుకున్నందున కొంతమేరకు సమస్య తీరింది.
ఇటీవల కలెక్టర్ దినేష్కుమార్ ఆసుపత్రుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు కోరగా వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ ఎస్.ఉష అందజేశారు. వాటిని భర్తీ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్