ధాన్యం రైతులకు న్యాయం చేయండి
‘‘కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తగ్గించి ధాన్యం కొనుగోలు చేశారు, తద్వారా రైతులు నష్టపోయారు, వారందరికీ న్యాయం చేయండి’’ అంటూ గ్రామానికి చెందిన కవిత మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని
బాలినేనికి అల్లూరులో మొర
తెదేపా, వైకాపా పక్షాల మధ్య వాగ్యుద్ధం
ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన తెదేపా కార్యకర్తపై
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని
కొత్తపట్నం, న్యూస్టుడే: ‘‘కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తగ్గించి ధాన్యం కొనుగోలు చేశారు, తద్వారా రైతులు నష్టపోయారు, వారందరికీ న్యాయం చేయండి’’ అంటూ గ్రామానికి చెందిన కవిత మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరులో బుధవారం సాయంత్రం ‘గడప, గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలినేనికి అర్జీ ఇచ్చారు. ‘రెండేళ్లుగా ధాన్యం కొనుగోలులో రైతులు నష్టపోయారు, ప్రభుత్వం 75 కిలోల బస్తాకు రూ.1450 ఇస్తే స్థానిక దళారులు రూ.1100కు కొనుగోలు చేశారు’ అంటూ వాపోయారు. అదే సమయంలో తెదేపా వర్గీయులు మాట్లాడుతూ గత రెండేళ్లుగా రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతలో కొందరు వైకాపా వర్గీయులు అక్కడకు చేరుకున్నారు. ‘రైతులకు లాభనష్టాలు తెలిసే అమ్ముకున్నారు. బాధిత రైతులుంటే చెప్పమనండంటూ’ స్థానికులకు సూచించారు. ఏ ఊరు మీది అంటూ ఇరువర్గాల మధ్య మాట, మాట పెరగడంతో వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడి నుంచి వారిని పంపించివేశారు. కాగా ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రశ్నించిన తెదేపా కార్యకర్తపై బాలినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మండల వైకాపా అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి, ఎంపీడీవో సుజాత, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలు తొలగించడం నా నైజం కాదు
కలెక్టరేట్ వద్ద ఫ్లెక్సీలు కట్టుకుంటే తీయించారని జనార్దన్ అంటున్నారని.. అది తమ నైజం కాదని బాలినేని అన్నారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశానని.. ఎవరేమిటో అందరికీ తెలుసన్నారు. తాను చెత్త రాజకీయాలు చేయనన్నారు.. మహానాడుకు లక్ష మంది వస్తారని తెదేపా నాయకులు చెబుతున్నారని.. మినీ స్టేడియంలో పట్టేది 15 వేల మందేనన్నారు. స్టేడియం ఎలా సరిపోతోందని.. అనుమతి ఇవ్వలేదని ఎందుకంటారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM