వెలుగు వీవోఏ ఆత్మహత్య
ఉరి వేసుకుని మహిళా వీవోఏ అనమలశెట్టి శ్రీలక్ష్మి(31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధి శివరాజ్నగర్లో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
శ్రీలక్ష్మి (పాత చిత్రం)
దర్శి, న్యూస్టుడే: ఉరి వేసుకుని మహిళా వీవోఏ అనమలశెట్టి శ్రీలక్ష్మి(31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధి శివరాజ్నగర్లో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పని ఒత్తిడా... ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న విషయాలు తెలియరాలేదు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అనమలశెట్టి సురేష్కు ఒంగోలుకు చెందిన శ్రీలక్ష్మితో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 11, 9 సంవత్సరాల వయసున్న కుమారులున్నారు. దర్శి వెలుగు కార్యాలయంలో శ్రీలక్ష్మి వీవోఏగా విధులు నిర్వర్తిస్తుండగా, సురేష్ స్థానికంగా కూల్డ్రింక్స్ దుకాణం నడుపుతున్నారు. శనివారం కార్యాలయంలో మీటింగ్ అనంతరం ఇంటికి వచ్చిన ఆమె అసహనంగా ఉన్నారని, విశ్రాంతి కోసం గదిలోకి వెళ్లారని ఆమె అత్త రత్తమ్మ చెబుతున్నారు. ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి పిలవగా సమాధానం రాకపోవడంతో భర్త సురేష్కు సమాచారం ఇచ్చారన్నారు. ఆయన వచ్చి తలుపులు తెరిచి చూడగా ఉరికి వేలాడుతోందని తెలిపారు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్త ఫిర్యాదు మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే ఆమె ధైర్యవంతురాలని, పని ఒత్తిడికి ఇబ్బంది పడేది కాదని సహోద్యోగులు చెబుతున్నారు. రెండు నెలలుగా మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతోందన్నారు. ఆమె ఆత్మహత్య వెనుక కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉన్నాయి.
యువకుడి బలవన్మరణం: కంభం: ఉరి వేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కందులాపురం పంచాయతీ కందులాపురం కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలియజేసిన వివరాల మేరకు.. కాలనీకి చెందిన ఉప్పు వెంకటరమణ (23) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లోని ఫంకాకు ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. వెంకటరమణకు తండ్రి తిరుపతయ్య, అక్కా, చెల్లి ఉన్నారు.
చెట్టును ఢీకొట్టిన కారు... యువతి మృతి
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: మండలంలోని కనుమళ్ల ఎస్సీ కాలనీలో చర్చి వద్ద ఆదివారం రాత్రి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో యువతి మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. 108 సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కందుకూరు సుల్తాన్ మొహిద్దీన్నగర్కు చెందిన పల్లా మహేష్, కందుకూరులోని మార్కెట్ కూడలి సమీపంలో నివసించే వర్షిణి(24) కారులో వెళుతున్నారు. అనుకోకుండా వాహనం అదుపు తప్పి రహదారి పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ముందుగా వారిని కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వర్షిణి మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫిరోజఫాతిమా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్