పునరావాసంలోనూ డొల్లతనమే..
జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సిద్ధం చేస్తున్న పునరావాస కాలనీల్లో నిర్మాణ పనులు తీసికట్టుగా ఉన్నాయి.
కోమటికుంట వద్ద కాలనీలో నాసిరకం నిర్మాణాలు
వెలిగొండ నిర్వాసితుల ఆవేదన
మార్కాపురం, న్యూస్టుడే
పునరావాస కాలనీలో నాసిరకం కంకరతో నిర్మించిన సీసీ రహదారి
జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సిద్ధం చేస్తున్న పునరావాస కాలనీల్లో నిర్మాణ పనులు తీసికట్టుగా ఉన్నాయి. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తండా ముంపు గ్రామాల నిర్వాసితులకు వేములకోట పంచాయతీలోని కోమటికుంట వద్ద 84 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. 850 ఆవాసాలు నిర్మించాల్సి ఉంది. ఇంకా ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదు. ప్రస్తుతం వివిధ సౌకర్యాల కోసం చేస్తున్న పనుల్లో డొల్లతనం బయటపడుతుంది.
పనుల కోసం భారీగా నిల్వ చేసిన నాణ్యత లేని కంకర
పునరావాస కాలనీలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక భవనం, దేవాలయం తదితరాలతో పాటు సీసీ రహదారులు నిర్మించాల్సి ఉంది. వీటికి నాణ్యతతో కూడిన చీమకుర్తి కంకర వినియోగించాల్సి ఉంది. గుత్తేదారులు మాత్రం పెద్దారవీడు మండలం కలనూతల గ్రామం వద్ద ఉన్న కొండరాయి కంకర తెచ్చి వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు కాలనీలో నిర్మాణం చేసినవాటికి దీనినే వాడారు. కొన్నాళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయి. ఇటీవల నిర్వాసితుల సమస్యలపై ‘ఈనాడు’ వరుస కథనాలు వెలువరించడంతో గత వారం రోజులుగా మళ్లీ ఆరంభించారు. నాసిరకం కంకర వాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన సీసీ రహదారులకు వాడేదీ ఇదే. దీనివల్ల వాహనాలు వచ్చినప్పుడు కుంగిపోయే ప్రమాదం ఉందని రెండు గ్రామాల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెల్లువెత్తిన ఫిర్యాదులు
గొట్టిపడియ, అక్క చెరువుతండా గ్రామస్థులు నివసించాల్సిన ఈ పునరావాస కాలనీలో ఇప్పటివరకు నాణ్యత లేని కంపెనీల సిమెంట్, ఇనుముతో పాటు మట్టితో కలిసిన ఇసుక, పూర్తిగా కొండ కొంకర ఉపయోగిస్తున్నారనేది నిర్వాసితుల ఫిర్యాదు. ఇటీవల వారంతా జేసీ అభిషిక్త్ కిషోర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జేసీ కంకరను మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా వారికి పట్టలేదు. ఇప్పటివరకు దేవాలయం, పాఠశాల, సామాజిక భవనాల నిర్మాణాలు 45 శాతం జరిగాయి. సీసీ రహదారులు కూడా రెండు లేయర్లు పూర్తయ్యాయి. వీటన్నింటికి రూ.30 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.5.50 కోట్ల బిల్లులు చెల్లించినట్లు ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారమే పనులు
ప్రభాకర్, ఈఈ, వెలిగొండ ప్రాజెక్టు, కంభం
ముంపు గ్రామాలకు కేటాయించిన పునరావాస కాలనీలో నిబంధనల ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాణ్యత పరిశీలనకు సామగ్రి సేకరించి ప్రయోగశాలకు పంపిస్తాం. చీమకుర్తి కంకర అక్కడ తగినంత లభించడం లేదు. రవాణా కూడా సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో కొండ కంకరను సీసీ రహదారులకు అడుగు భాగాన వినియోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో అదే కంకర వాడటంలేదు. వస్తుసామగ్రి అంతా నాణ్యమైనదే. నాసిరకం వాడితే బిల్లులు చేసే పరిస్థితి ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్