అనాథ దివ్యాంగుల సేవకే అంకితం
చెన్నై లోని వేలూరుకు చెందిన సుబ్రహ్మణ్యం యుక్త వయస్సులో మద్యం, సిగిరేట్లకు బానిసయ్యాడు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లడంతో అక్కడికి వెళ్లారు.
వృద్ధాప్యంలోనూ వంట వండి పెడుతూ..
కొయ్య బొమ్మల తయారీలో దిట్ట
తాను చేసిన కళారూపాన్ని చూపిస్తున్న సుబ్రహ్మణ్యం
ఓ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమంలో చికిత్స పొందిన ఆ యువకుడు అక్కడి దివ్యాంగులైన అనాథలను చూసి చలించి పోయాడు. వారి సేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు. వయస్సు మీద పడినా వారికి వంట చేసి పెడుతూ జీవనం సాగిస్తూ తనకు వచ్చి కళతో ఉచితంగా కొయ్య బొమ్మలు తయారీ చేస్తూ పలువురికి అందిస్తున్నారు. అతనే యర్రగొండపాలెంలోని అనాథ ఆశ్రమంలో ఉంటున్న 72 ఏళ్ల సుబ్రహ్మణ్యం. వంటకు సేకరించిన కొయ్యలతో వివిధ కళా రూపాలను తయారు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్టుడే : చెన్నై లోని వేలూరుకు చెందిన సుబ్రహ్మణ్యం యుక్త వయస్సులో మద్యం, సిగిరేట్లకు బానిసయ్యాడు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లడంతో అక్కడికి వెళ్లారు. ఒక రోజు ఓ టీ దుకాణం వద్ద సిగరెట్ కాలుస్తుండగా నిప్పు ఒంటిపై పడి దుస్తులు అంటుకుని ఓళ్లంతా కాలిపోయింది. ఒంటి నిండా గాయాలతో ఉండగా ఓ సిస్టర్ ఆయన పరిస్థితిని చూసి ఒక ఫాదర్ వద్దకు తీసుకెళ్లి చర్చి ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమంలో చికిత్సలు అందించింది. ఆ ఆశ్రమంలో ఉండే వారంతా అనాథలు, దివ్యాంగులు. కోలుకున్న ఆయన అక్కడ ఉండే మానసిక దివ్యాంగులకు సేవ చేయాలని సంకల్పించాడు. అప్పటి నుంచే వారికి సేవలు చూస్తే ఉండిపోయాడు.
యువకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మల్కాజ్గిరి రైల్వేస్టేషన్లో ఒకరోజు కొయ్యబొమ్మలు తయారు చేసే వ్యక్తిని చూసి అతని పనితీరు గమనించి మొదట సారిగా కొడవలితో ఒక చర్చి బొమ్మను తయారు చేశారు. అక్కడ నుంచి కొయ్య బొమ్మల తయారీలో ప్రావీణ్యం సంపాదించారు. సాయిబాబా బొమ్మలతో పాటు వివిధ బొమ్మలు తయారు చేసి ఇచ్చేవాడు. మూడేళ్ల కిందట హైదరాబాద్ నుంచి వై.పాలెంలోని సన్జో సేవాలయానికి వచ్చారు. ఇక్కడ ఉండే 20 మంది మానసిక వికలాంగులకు వంట చేసి పెట్టి వారికి సేవ చేస్తున్నారు.
ఇదే నాకు తృప్తి
అనాథ, మానసిక వికలాంగుల ఆకలి తీర్చడం లోనే నాకు సంతృప్తి ఉంది. ఊపిరి ఉన్నంత వరకు వీరికి సేవ చేస్తాను. ఆశ్రమాన్ని సందర్శించేందుకు వచ్చే దాతలకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఇళ్లలో జరుపుకొనే శుభకార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను వృథాగా పడేయకుండా అనాథలకు అందించి వారి ఆకలి తీర్చమని కోరుతున్నా. బొమ్మ తయారు చేయడం నాకు సరదా అంతే.
సుబ్రహ్మణ్యం
ఆకట్టుకునేలా..
పావురం
ఈ వృద్ధుడు ఒక పక్క దివ్యాంగులకు సేవ చేస్తూ ఆకట్టుకునే కొమ్మ బొమ్మలను తయారు చేయడం విశేషం. వంట వండి దివ్యాంగులంతా తిన్న తరువాత తినే ఈయన ఖాళీ సమయాల్లో ఇళ్లలో ఉండే టీవీ, ఫ్రిజ్, టేబుల్ పై ఆకర్షణగా ఉంచే పక్షులు, చేపలు, పడవలు తయారు చేస్తుంటారు. తాను చూసింది అచ్చుగుద్దినట్లుగా బొమ్మను తయారు చేయడం ఈ వృద్ధుడి ప్రత్యేకత. క్రిస్మస్ వేళలో క్రీస్తు, మేరీ మాత, చర్చి బొమ్మలు రూపొందిస్తుంటారు. ఇంటి ముందు ద్వారబంధాలను అలంకరించే అందమైన రూపాలను చెక్కు అందిస్తుంటారు. ఇవన్నీ ఎవరైనా కోరితే ఉచితంగా తయారు చేసి ఇస్తుంటారు. ఆశ్రమంలో దివ్యాంగులకు సాయం చేసేందుకు వచ్చే దాతలు ఈయన కళా రూపాలను చూసి అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ