మిగిలింది అప్పులు.. కన్నీరు
వరుణుడు కరుణించ లేదు.. భూగర్భంలో నీటి చెమ్మ జాడ కానరావడం లేదు.. వందల అడుగు లోతు బోరు తవ్వినా గంగమ్మ కరుణించడం లేదు.. అందిన కాడికి అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప పంటేమో కాపు దశలో కళ్లెదుటే ఎండుముఖం పట్టింది.
మిర్చి సాగుపై కరవు ప్రభావం
కాపు దశలో వదిలేసిన వైనం
నీరు లేక చేతికి అందకుండా పోతున్న ఓ మిర్చి తోట
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్టుడే: వరుణుడు కరుణించ లేదు.. భూగర్భంలో నీటి చెమ్మ జాడ కానరావడం లేదు.. వందల అడుగు లోతు బోరు తవ్వినా గంగమ్మ కరుణించడం లేదు.. అందిన కాడికి అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప పంటేమో కాపు దశలో కళ్లెదుటే ఎండుముఖం పట్టింది. ఈ పరిస్థితులతో కర్షకులు కంట తడి పెడుతున్నారు. ఇదీ త్రిపురాంతకం మండలంలోని మెట్ట ప్రాంతాలైన రామసముద్రం, దువ్వలి గ్రామాల్లో దయనీయ పరిస్థితి.
లారీలు.. ట్రాక్టర్ ట్యాంకర్లతో తడులు...: సాగర్ ఆయకట్టుకు ఎగువన 1,300 ఎకరాల్లో రైతులు ఈ ఏడాది మిరప సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో బోరు బావులు ఒట్టిపోయాయి. కాపు దశలోని మిర్చి ఎండుముఖం పడుతుండటంతో రామసముద్రం, దువ్వలి గ్రామాలకు చెందిన రైతులు 22 లారీలు, 65 ట్రాక్టర్ల ట్యాంకర్లతో 15 రోజుల పాటు నీటి తడులు అందించారు. ఒక్కో లారీ ట్యాంకర్ రూ.5 వేలు, ట్రాక్టర్కు రూ.700 చొప్పున చెల్లించారు. లారీల ట్యాంకర్లతో 110 ట్రిప్పులు, ట్రాక్టర్ల ట్యాంకర్లతో 325 ట్రిప్పుల మేర రోజూ రవాణా చేశారు. ఇందుకుగాను రూ.7.60 లక్షల వరకు వెచ్చించారు.
ఆనందం.. 15 రోజుల్లోనే ఆవిరి...: డిసెంబరు 10 నుంచి అయిదు రోజుల పాటు మాండౌస్ తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెంది బోరు బావుల నుంచి నీరు రావడంతో రైతులు ఎంతగానో సంతోషించారు. అయితే ఆ ఆనందం 15 రోజుల్లోనే ఆవిరైంది. బోరు బావులు అధిక సంఖ్యలో ఎండిపోయాయి. ఆశ చావని కొందరు రైతులు ట్యాంకర్లతో నీటి తడులు అందిస్తున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడులు వెచ్చించినప్పటికీ పంట చేతికి అందడం కష్టంగా మారింది. చేసేదేమీ లేక కొందరు కాపు దశలో పొలాలను వదిలేశారు. పెట్టిన పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.
నీటి తడులకే రూ. లక్షలు
పదెకరాల్లో ఈ ఏడాది మిరప సాగు చేశాను. రూ.12 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాను. కాపు, కోత దశలో అయిదు బోరు బావులు ఒట్టిపోయాయి. ట్యాంకరు ద్వారా తడులకు రూ.లక్షా ఇరవై వేలు వెచ్చించాను. దీనికి తోడు నల్లి కూడా ఆశించడంతో పంట వదిలేశాను. ఇప్పుడు పొలం అమ్మినా అప్పు తీరే పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లెళ్ల వెంకటరెడ్డి, రైతు, దువ్వలి
కూలీల ఖర్చుకే ఆదాయం సరి...
నాలుగున్నర ఎకరాల్లో మిరప నాటాను. కాపు దశలో నీటి తడులు అందక ఎండిపోతుండటంతో రూ.2 లక్షలు వెచ్చించి రెండు బోరు బావులు తవ్వించినా నీరు పడలేదు. రెండు ఎకరాలకు రూ.30 వేలు వెచ్చించి నీటి తడులు అందించా. ఇప్పటి వరకు రూ.6 లక్షల పెట్టుబడిగా పెడితే రూ.60 వేల ఆదాయం వచ్చింది. ఆ మొత్తం కూలీలకు సరిపోయింది.
చిలకల రవీంద్రరెడ్డి, రైతు, రామసముద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?