సమస్యలకు సొమ్ముల్లేవు కానీ.. విహార యాత్రకు!
ఒంగోలు నగరంలో వందలాది సమస్యలు పేరుకున్నాయి. అనేక కాలనీల్లో కనీస మౌలిక వసతులు కరవు. రహదారులు దుర్భరం.. కాలువల పరిస్థితి చెప్పనవసరమే లేదు. నిధుల సమస్యతో ఏవీ పరిష్కారం కావడంలేదు.
20 నుంచి ఇతర రాష్ట్రాలకు అధికార పార్టీ కార్పొరేటర్లు
రూ.39 లక్షల కేటాయింపు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఒంగోలు నగరంలో వందలాది సమస్యలు పేరుకున్నాయి. అనేక కాలనీల్లో కనీస మౌలిక వసతులు కరవు. రహదారులు దుర్భరం.. కాలువల పరిస్థితి చెప్పనవసరమే లేదు. నిధుల సమస్యతో ఏవీ పరిష్కారం కావడంలేదు. ఇలాంటి తరుణంలో ఒంగోలు కార్పొరేటర్లు లక్షలాది రూపాయల కార్పొరేషన్ సొమ్ముతో అధ్యయన యాత్రకు సన్నద్ధమవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు గతంలోనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినప్పటికి మెజార్టీ సభ్యుల మద్దతుతో ఆమోదముద్రను వైకాపా సభ్యులు వేయించుకున్నారు. ప్రతిపాదనలను ముందుగా కలెక్టర్కు పంపగా ఈ అంశంపై డీఎంఏ అనుమతి తీసుకోవాలని తెలపడంతో.. తిరిగి దస్త్రాన్ని డీఎంఏకి పంపించి ఆమోదం పొందారు. ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు యాత్రకు వచ్చేది లేదని తేల్చిచెప్పగా అధికార పార్టీలోని మెజార్టీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఇద్దరు అధికారులు మొత్తం 49 మందితో ఈ నెల 20న పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మేయర్కు వ్యక్తిగత పనులు ఉండటంతో వెళ్లాలా? లేదా అనేది నిర్ణయించుకోలేదని సమాచారం. పర్యటన ఖర్చు కింద నగరపాలక సంస్థ రూ.39 లక్షలు కేటాయించింది.
బిల్లులూ చెల్లించలేని పరిస్థితి
ఒంగోలు నగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రస్తుతం చేసిన అభివృద్ధి పనులకు గాను గుత్తేదారులకు దాదాపు రూ.10 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. పొరుగు సేవల ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. నగరంలో చెత్త సేకరణకు వినియోగిస్తున్న పుష్కాట్స్ మరమ్మతులకు వచ్చినా బాగు చేయించలేకపోతున్నారు. దోమలతో అల్లాడుతున్న తరుణంలో మరో ఫాగింగ్ మిషన్ కొనుగోలుచేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నా నిధుల సమస్య వెన్నాడుతుంది. పన్నులు సక్రమంగా వసూలు కావడంలేదు. ఆదాయం లేక అమరజీవి కాంప్లెక్స్లో అర్ధంతరంగా నిర్మాణం నిలిచిపోయిన దుకాణాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రతిపాదించారు. శివారు కాలనీల్లో రోడ్లు, కాలువలు లేవు.
ఎక్కడెక్కడికి వెళ్తారంటే..
ఈనెల 20 నుంచి పదిరోజులపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు పర్యటిస్తారు. 20న హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో దిల్లీ చేరుకుంటారు. నైనిటాల్, హరిద్వార్, రిషికేష్, ముస్సోరి, చండీఘర్, తాజ్మహల్, జైపూర్ సందర్శిస్తారు. చండీఘర్, దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు వెళ్లి అక్కడి పారిశుద్ధ్య పనుల తీరుపై తెలుసుకుంటారు. వినోదం కలిగించే అహ్లాదకరమైన ప్రదేశాలను తిలకించడంతోపాటు మున్సిపల్ పరిపాలన పరమైన అంశాలపై అధ్యయనం చేసేలా పర్యటన ఏర్పాటు చేసినట్లు మేయర్ సుజాత తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!