logo

మీరు ఎవరు? ఆ సీటులో ఎందుకు కూర్చున్నారు?

మార్కాపురం మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ఉప కలెక్టర్‌ సేథు మాధవన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.

Published : 24 Mar 2023 03:49 IST

మార్కాపురం ఎంపీపీ భర్తపై ఉప కలెక్టర్‌ ఆగ్రహం

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ఉప కలెక్టర్‌ సేథు మాధవన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఎంపీపీ కార్యాలయంలో ఉన్న వ్యక్తులను బయటకు పిలిపించారు. ‘‘మీరు ఎవరు? ఆ సీటులో ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ ఎంపీపీ మహిళ కదా? అధికారుల అనుమతి లేకుండా మీతో పాటు ఇతరులు ఎందుకు ఉన్నారు?’’ అంటూ ఎంపీపీ భర్త, వైకాపా నాయకుడు పోరెడ్డి చెంచిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని, ప్రోటోకాల్‌ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన దస్త్రాలు మాయమైతే ఎవరిది బాధ్యత అన్నారు. ఎంపీపీ లేని సమయంలో ఆమె కార్యాలయాన్ని తెరిచి అక్కడ కూర్చోవడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇక్కడి పరిస్థితులపై తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని ఎంపీడీవో నరసింహులు, కార్యాలయంలోని అధికారులను ఉప కలెక్టర్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని